ETV Bharat / state

అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసు - సీఎంకు నాలుగు వారాలు గడువు కోరిన పీసీసీ లీగల్​ సెల్​ - Amit Shah Fake Video Case

author img

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 3:03 PM IST

Amit Shah Fake Video Case update
Amit Shah Fake Video Case

Amit Shah Fake Video Case : అమిత్​ షా వీడియో మార్పింగ్​ కేసులో పీసీసీ లీగల్​ సెల్​ నేతలు స్పందించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్​ రెడ్డికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రి అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసులో ఇటీవల గాంధీభవన్​కు దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన తెలిసిందే కదా.

Amit Shah Morphing Video Case Update : కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసులో దిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పీసీసీ లీగల్​ సెల్​ నేతలు వివరణ ఇచ్చారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో స్టార్​ క్యాంపెయినర్​ అయిన సీఎం రేవంత్​ రెడ్డి తీరిక లేకుండా ఉన్నందున నాలుగు వారాల గడువు కావాలని దిల్లీ పోలీసులను కోరినట్లు లీగల్​ సెల్ నాయకులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసులో ఇటీవలే గాంధీభవన్​లో పోలీసులు నోటీసులిచ్చారు. రేవంత్​ రెడ్డి సహా పీసీసీ సామాజిక మీడియా ఛైర్మన్​ మన్నెే సతీశ్​, నవీన్, శివకుమార్​, అస్మా తస్లీమ్​కి దిల్లీ పోలీసులు నోటీసులు అందించారు.

ఐతే సాంకేతికపర అంశాలని పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉన్నందున లీగల్​ సెల్​ ఛైర్మన్​ మన్నే సతీశ్​, మరో ముగ్గురికి రెండు వారాలు గడువు కావాలని కోరినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్​ రెడ్డి లోక్​సభ ఎన్నికల్లో స్టార్​ క్యాంపెయినర్​గా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నందున నేడు విచారణకు రాలేరని తెలిపారు. సీఎం విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల గడువు కావాలని కోరినట్లు లీగల్​ సెల్​ నాయకులు తెలిపారు.

కాంగ్రెస్​ సోషల్​ మీడియా కార్యకర్త ఫోన్​ జప్తు : కాంగ్రెస్​ సోషల్​ మీడియా కార్యకర్త గీత ఫోన్​ను దిల్లీ పోలీసులు జప్తు చేశారు. సికింద్రాబాద్​ శాంతినగర్​కు చెందిన గీతకు 41ఏ నోటీసులు ఇచ్చి, ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అసలేం జరిగింది : ఈనెల 23వ తేదీన తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్​ షా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఆ హక్కులను తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తామని అన్నారు. కానీ కొంత మంది ఆ మాటలను వక్రీకరించి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్​ షా చెబుతున్నట్లు ఎడిట్​ చేశారని కేంద్ర హోంశాఖ, బీజేపీ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మాటలను వక్రీకరించారని, ఫేక్​ వీడియోను సోషల్​ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేశారనే అభియోగంతో సీఎం రేవంత్​ రెడ్డి సహా మరో నలుగురు కాంగ్రెస్​ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను నేరుగా గాంధీభవన్​కు పంపించారు. ఈ నోటీసులు అందుకున్న మే 1వ తేదీన విచారణకు హాజరుకాని పక్షంలో సీఆర్​పీసీ 91/160 కింద క్రిమినల్​ ప్రొసీడింగ్స్​ ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. దిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం వారు ఏప్రిల్​ 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద ఎఫ్​ఐఆర్​ ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల అంశంపై సీఎం రేవంత్​ రెడ్డి సైతం ఘాటుగానే స్పందించారు.

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు - భయపడేది లేదన్న సీఎం రేవంత్​

అమిత్​ షా మాటలను మార్ఫింగ్​ చేయడం- దేశ భద్రతకు సంబంధించిన అంశం: కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.