ETV Bharat / state

జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై భూకబ్జా కేసు, ఆరోపణలు ఖండించిన ఎంపీ - CASE AGAINST MP JOGINAPALLY SANTOSH

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 12:38 PM IST

Updated : Mar 24, 2024, 5:58 PM IST

Case against BRS MP Joginapally Santosh
Case against BRS MP Joginapally Santosh

Case Against BRS EX MP Joginapally Santosh : బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Case Against BRS EX MP Joginapally Santosh : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడుతున్న వ్యవహారంలో బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్​లో కేసు నమోదైంది. నవయువ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్‌ ప్రతినిధి చింతా మాధవ్ ఫిర్యాదుతో అతనితో పాటు లింగారెడ్డి శ్రీధర్ మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్‌ - TS PHONE TAPPING CASE UPDATE

Police Case On BRS EX MP Santhosh : బంజారాహిల్స్ రోడ్‌ నంబర్ 14 లోని సర్వే నంబర్ 129/54లోని కరణ్ దుబే అతని భార్యా భారతి దుబేల నుంచి 1350 చ.గజాల స్థలాన్ని తమ కంపెనీ కొనుగోలు చేసిందని తెలిపారు. దీనిలో కొన్ని రోజుల క్రితం రెండు గదులు నిర్మించి జోగినపల్లి సంతోష్, లింగారెడ్డి శ్రీధర్ నకిలీ డోర్ నంబర్లు సృష్టించి జీహెచ్ఎంసీకి పన్ను కూడా కడుతున్నారని చింతా మాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఈ నెల 21న చింతా మాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దితో పాటు మరి కొందరిపై సెక్షన్‌ 400, 471,447,120బి రెడ్‌ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

ఆరోపణలు ఖండించిన సంతోష్ కుమార్ : నవయుగ ఇంజినీరింగ్ కంపనీ లిమిటెడ్‌ ఫిర్యాదుతో బంజారాహిల్స్​లో తనపై నమోదైన కేసుపై సంతోష్ కుమార్‌ స్పందించారు. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుందని ఆయన తెలిపారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని తాను, శ్యాంసుందర్ ఫుల్జాల్ నుంచి 2016లో రూ. 3.81కోట్లు చెల్లించి, సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశానన్నారు. ఫోర్జరీ అనే మాటకు తావులేదని అదంతా అవాస్తవం అన్నారు.

అఫిడవిట్​లోనూ ఈ స్థలం వివరాలు : ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదన్న ఆయన, తాను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని కూడా తెలిపారు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఒకవేళ న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీసు ఇచ్చి వివరణ కోరకుండా ఇలా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు ఎలా నమోదు చేశారన్నారు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎన్నికల అఫిడవిట్​లో కూడా భూమికి సంబంధిచిన వివరాలు ఇచ్చానని గుర్తు చేవారు.

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ - కాలేజీ కోసం వేసిన రోడ్డును కూల్చేసిన అధికారులు

ప్రణీత్ రావు వ్యవహరంలో వెలుగులోకి కీలకాంశాలు - కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల ఆచూకీ గుర్తించిన పోలీసులు - DSP Praneeth Rao Case updated

Last Updated :Mar 24, 2024, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.