ETV Bharat / sports

ధావన్ జెర్సీలో మార్పు- ఇకపై కొడుకు పేరుతోనే బరిలోకి? - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 10:03 AM IST

Shikhar Dhawan Jersey
Shikhar Dhawan Jersey

Shikhar Dhawan Jersey: పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. తన కుమారుడి పేరుతో ఉన్న జెర్సీ ధరించిన ఫొటో షేర్ చేశాడు.

Shikhar Dhawan Jersey: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా మరో సారి ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్‌లో పంజాబ్ ఫ్రాంచైజీకి ఆడుతున్న ధావన్ జెర్సీని కొడుకు పేరుతో రెడీ చేయించాడు. నెం.1 వేయించి ZORAVER పేరున్న ఆ జెర్సీని ధరించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దాని కింద ఎమోషనల్‌గా నువ్వెప్పుడూ నాతోనే ఉంటావ్ (You're Always with Me, My Boy) అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఇక ఈ జెర్సీతోనే ధావన్ నెక్ట్స్​ మ్యాచ్​ల్లో బరిలోకి దిగాలంటూ ఫ్యాన్స్​ కామెంట్ చేస్తున్నారు. దీంతో జొరావర్ పేరుతో ఉన్న జెర్సీతోనే గబ్బర్ బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదని ఇంకొందరు అంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే ధావన్, భార్యతో విడిపోయిన తర్వాత నుంచి కొడుకుతో దిగిన ఫొటోలను మాత్రమే షేర్ చేసుకుంటున్నాడు. పైగా అవన్నీ కొడుకుతో తాను చెప్పాలనుకున్న మాటలే అన్నట్లుగా ధావన్ పోస్టులు ఉంటున్నాయి. ఆయేషాతో విడిపోయిన తర్వాత కొడుకే సర్వంగా గడిపేస్తున్న ధావన్ గతంలోనూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

'మనం నేరుగా కలిసి ఏడాది కావొస్తుంది. గత మూడు నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా నన్ను అన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు. నీతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ, టెలిపతితో ఎప్పుటికీ నీ మనసుకు దగ్గరగానే ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను' అని ధావన్ గతంలో పోస్టు పెట్టాడు.

'నాన్న నిన్ను మిస్ అవుతున్నా. ఆ దేవుని దయతో మనం కలిసే రోజు కోసం నువ్వు చిరునవ్వుతో ఎదురుచూస్తావని నాకు తెలుసు. అప్పటి వరకూ బలంగా, ధైర్యంగా, సహనంగా, హుందాగా ఉండు. కొంటెగా ఉండు కానీ, అల్లరి చేయకు. నిన్ను రోజూ కలవకపోయినా నీకు మెసేజ్‌లు పంపుతున్నా. నీ గురించి తెలుసుకుంటున్నా. లవ్ యూ జోరా నాన్న' అని అందులో చాలా భావోద్వేగానికి గురయ్యాడు.

గతేడాది విడాకులు
ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియన్ కిక్ బాక్సర్‌ను అక్టోబర్ 2012లో వివాహమాడాడు ధావన్. పరస్పర అంగీకారంతో ఎనిమిదేళ్ల వివాహ బంధం తర్వాత వారిద్దరూ కోర్టు ద్వారా విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత తన కుమారుడితో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది. దీంతో మధ్య ధావన్ తన కుమారుడితో వీడియోకాల్‌లో మాట్లాడిన ఫొటోను కూడా పోస్ట్‌ చేశాడు.

2024 ఐపీఎల్​లో ధావన్ ఇప్పటివరకు 5 మ్యాచ్​లు ఆడాడు. ​అందులో 125.62 స్ట్రైక్ రేట్​తో 152 పరుగులు చేశాడు. ఇక గాయం కారణంగా రాజస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన ధావన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గురువారం ముంబయితో ముల్లాన్‌పుర్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లోనూ ధావన్ ఆడేది డౌటే.

తనయుడి కోసం ధావన్​ ఎమోషనల్ - 'దేవుడి దయ వల్ల మనం మళ్లీ కలుస్తాం'

'నా కొడుకు ఎక్కడున్నా నాన్న కోసం వస్తాడు': ధావన్ ఎమోషనల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.