ETV Bharat / sports

అయోధ్యకు కేశవ్ మహరాజ్- రామయ్యను దర్శించుకున్న సౌతాఫ్రికా ప్లేయర్ - Keshav Maharaj Ayodhya visit

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 2:41 PM IST

Updated : Mar 21, 2024, 3:05 PM IST

Keshav Maharaj Ayodhya
Keshav Maharaj Ayodhya

Keshav Maharaj Ayodhya: సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ అయోధ్య బాల రాముణ్ని దర్శించుకున్నాడు. కేశవ్​తో పాటు లఖ్​నవూ ఫ్రాంచైజీ ప్లేయర్లు, సిబ్బంది కూడా అయోధ్య సందర్శించారు.

Keshav Maharaj Ayodhya: సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ అయోధ్య రామ మందిరాన్ని గురువారం సందర్శించాడు. తాను బాల రాముణ్ని దర్శించుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపాడు. ఈ మేరకు మందిరంలో దిగిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు. అయితే 2024 ఐపీఎల్​లో పాల్గొనేందుకు కేశవ్ రీసెంట్​గా భారత్​కు వచ్చాడు. అతడు ఈ సీజన్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా, గతేడాది వన్డే వరల్డ్​కప్​ సమయంలో భారత్​కు వచ్చిన కేశవ్ కేరళలోని పలు ఆలయాలు సందర్శించాడు.

అయితే కేశవ్ మహరాజ్ భారతీయ మూలాలున్న సౌతాఫ్రికా పౌరుడు. అతడి పూర్వికులు (తాత) ఉత్తర్​ప్రదేశ్ సుల్తాన్​పుర్​కు చెందినవారు. కేశవ్ భార్య లెరిషా మున్సామీ ఓ కథకళి డ్యాన్సర్. ఇక జనవరి బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కూడా కేశవ్ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈసారి భారత్​కు వచ్చినప్పుడు కచ్చితంగా అయోధ్య మందిరాన్ని సందర్శిస్తానన్న కేశవ్ తాజాగా దర్శించుకున్నాడు.

గతంలో సౌతాఫ్రికా ఆడిన మ్యాచ్​​ల్లో కేశవ్ బ్యాటింగ్​కు వచ్చే సమయంలో పలుమార్లు రాముడి పాటలు ప్లే చేశారు. గతేడాది జరిగిన సౌతాఫ్రికా- భారత్ టెస్టు, వన్డే సిరీస్​లోనూ ఆదిపురుష్ సినిమాలోని 'సీతా రామ్' పాట ప్లే చేశారు. 'నువ్వు వచ్చినప్పుడు రాముడి పాట ప్లే చేస్తున్నారు' అని అప్పట్లో టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, కేశవ్​తో చెప్పగా, కేశవ్ నవ్వుతూ అవునని బదులిచ్చాడు.

Lucknow Super Giants Team Visit Ayodhya: కేశవ్​తోపాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్, లఖ్​నవూ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ఇతర సిబ్బంది కూడా బాలక్ రామ్​ను దర్శించుకున్నారు. ఈ ఫొటోను లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ మేనేజ్​మెంట్ సోషల్​ మీడియాలో షేర్ చేసింది. 'లఖ్​నవూ నుంచి అయోధ్య వరకు' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక వీరి దర్శనం కోసం ఫ్రాంచైజీ యాజమాన్యం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్​లో లఖ్​నవూ మార్చి 24న రాజస్థాన్​ రాయల్స్​తో తొలి మ్యాచ్ ఆడనుంది.

'ఫ్యామిలీతో కేశవ్ అయోధ్య ట్రిప్​- అందుకు LSG ఏర్పాట్లు?'

రామ్​ లల్లా ప్రాణప్రతిష్ఠ- సౌతాఫ్రికా క్రికెటర్ స్పెషల్ విషెస్

Last Updated :Mar 21, 2024, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.