ETV Bharat / sports

8 నెలల్లో మూడుసార్లు -  భారత క్రికెట్ అభిమానులకు బాధ మిగిల్చిన ఆసీస్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 9:04 AM IST

Updated : Feb 12, 2024, 12:13 PM IST

India vs Australia Finals : భారత క్రికెట్‍ అభిమానులకు గత 8 నెలల్లో మూడుసార్లు బాధను మిగిల్చింది ఆస్ట్రేలియా. మూడు ఫైనల్స్​లో టీమ్​ ఇండియాను ఓడించింది. దాని వివరాలివే?

India vs Australia Finals
India vs Australia Finals

India vs Australia Finals : భారత క్రికెట్ అభిమానులను మరోసారి నిరాశలోకి నెట్టేసింది ఆస్ట్రేలియా. ఇంకా చెప్పాలంటే గత 8 నెలల్లో ఏకంగా మూడుసార్లు అంతులేని బాధను మిగిల్చింది. గతేడాది రెండుసార్లు టీమ్​ ఇండియాకు ఐసీసీ ట్రోఫీ దక్కకుండా చేసింది. ఇప్పుడేమో ఈ ఏడాది అండర్ - 19 టీమ్​పై​ ఆధిపత్యం చెలాయించి వరల్డ్ కప్​ను ఎగరేసుకుపోయింది. ఫిబ్రవరి 11 జరిగిన అండర్-19 వర్లల్డ్ కప్​ ఫైనల్​లో మన కుర్రాళ్లను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఈ నేపథ్యంలో గత 8 నెలల్లో టీమ్​ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచిన మూడు ఫైనళ్ల మ్యాచ్​ వివరాలను తెలుసుకుందాం.

డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023)
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‍షిప్ (2021-23) ఫైనల్‍ గతేడాది జరిగింది. ఇందులో టీమ్​ఇండియాను ఆసీస్​ బలంగా దెబ్బతీసింది. 2023 జులై 7 నుంచి 11వ తేదీ మధ్య ఇంగ్లాండ్​ ఓవల్ వేదిక జరిగిందీ తుది పోరు. ఇందులో ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అలా టీమ్​ ఇండియా ఐసీసీ ట్రోఫీ ఆశలపై నీళ్లు జల్లి టైటిల్​ను ఎగరేసుకుపోయింది ఆ జట్టు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‍లో తొలి ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు 469 పరుగులు చేసింది. టీమ్​ ఇండియా 296 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 270 పరుగులకే డిక్లేర్ చేసింది. తద్వారా 444 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. అయితే ఈ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌటై ఓటమిని అందుకుంది. అలా వరసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఓటమిని అందుకుంది.

వన్డే ప్రపంచ కప్ ఫైనల్(ODI World Cup Final 2023 IND VS Aus)
గతేడాది(2023) స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్​లో అద్భుతమైన ప్రదర్శనతో అజేయంగా ఫైనల్‍ వరకు చేరింది టీమ్​ ఇండియా. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఆస్ట్రేలియాతో తలపడింది. అయితే ఈ తుది పోరులో 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలన్న భారత్ కలను ఆసీస్ చెరిపివేసింది. ఈ తుదిపోరులో 6 వికెట్ల తేడాతో మనోళ్లు ఓడిపోయారు. అలా ఆరోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్​ను ఎత్తుకెళ్లిపోయింది. మొత్తంగా 2023లో రెండు సార్లు దెబ్బకొట్టింది ఆసీస్​.

అండర్-19లోనూ(Under - 19 World Cup 2024)
ఈ ఏడాది ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్​లోనూ టీమ్​ ఇండియాకు నిరాశ మిగిల్చింది ఆస్ట్రేలియా. ఫిబ్రవరి 11 అండర్- 19 ప్రపంచకప్ ఫైనల్‍లోనూ 79 పరుగుల తేడాతో భారత్ పై గెలిచింది. ఈ మెగా టోర్నీలో అజేయంగా ఫైనల్‍‍ వరకు దూసుకొచ్చిన యువ్ భారత్​ను తుదిపోరులో చిత్తు చేసింది. ఇలా గత 8 నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా సీనియర్ టీమ్ రెండుసార్లు, జూనియర్ జట్టు ఓసారి టీమ్​ఇండియాను ఫైనల్స్​లో ఓడించాయి.

ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం

అండర్ -19 వరల్డ్ కప్​ : భారత్​ను దెబ్బకొట్టిన ఆసీస్ బ్యాటర్​ మనోడే!

Last Updated : Feb 12, 2024, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.