ETV Bharat / sports

IPLకు హైబ్రిడ్ పిచ్​​ రెడీ- దీనివల్ల లాభాలేంటో తెలుసా? - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 5:39 PM IST

Hybrid Pitch Dharamsala
Hybrid Pitch Dharamsala (Source: ANI)

Hybrid Pitch Dharamsala: హిమాచల్​ప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో బీసీసీఐ సోమవారం హైబ్రిడ్ పిచ్ ఆవిష్కరించనుంది. మరి ఈ హైబ్రిడ్ పిచ్​లు అంటే ఏమిటో తెలుసా?

Hybrid Pitch Dharamsala: హిమాచల్​ప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో భారతదేశపు తొలి 'హైబ్రిడ్ పిచ్​'ను సోమవారం ఆవిష్కరించనున్నారు. ఈ ఈవెంట్​కు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, పలువురు క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్​, ఓవల్ స్టేడియాల్లో ఇప్పటికే వినియోగిస్తున్న ఈ హైబ్రిడ్ పిచ్​లను ఇప్పుడు భారత మైదానాల్లో పరిశీలించనున్నారు. మరి ఈ హైబ్రిడ్ పిచ్ అంచే ఏంటి? దీంతో లాభాలేంటో చూద్దాం.

అసలేంటీ హైబ్రిడ్ పిచ్: ప్రస్తుతం క్రికెట్​లో నాన్ హైబ్రిడ్ పిచ్​ (డస్ట్​, గ్రీన్ పిచ్​)లు వాడుతున్నారు. ఇందులో కొన్ని బ్యాటింగ్​కు అనుకూలిస్తే, మరికొన్ని బౌలింగ్​కు సహకరిస్తాయి. అలా కాకుండా క్రికెట్​లో బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే పిచ్​లు ఉంటే గేమ్ మజా వస్తుంది. అందుకోసం క్రికెట్​ పిచ్​లు తయారు చేసే సంస్థ 'సిస్‌గ్రాస్‌' (SIS Grass) ఈ హైబ్రిడ్ మోడల్ పిచ్​లు రూపొందించింది.

ఈ పిచ్​లను పూర్తిగా యూనివర్సల్ ఎలక్ట్రిక్ మషీన్​తో తయారు చేస్తారు. ఇందులో సహజసిద్ధమైన గడ్డినే వాడతారు. ఇందులో కేవలం ఐదుశాతం పాలిమర్‌ ఫైబర్​ కలిసి ఉంటుంది. దీంతో పిచ్‌లు చాలా సేపు పాటు తాజాగా ఉంటాయి. ఇది గేమ్ క్వాలిటీని పెంచుతుంది.

ఈ పిచ్​ వల్ల లాభాలేంటీ? నాన్ హైబ్రిడ్ పిచ్​ కంటే హైబ్రిడ్ పిచ్​లో ఎక్కువ మ్యాచ్​లు ఆడవచ్చు. ఈ పిచ్​ మెయింటెనెన్స్​ కూడా తక్కువే. పైగా పిచ్​ను తరచూ రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో స్టాఫ్​కు కూడా పిచ్ రెడీ చేయడం సులభంగా ఉంటుంది. ఇక నాన్ హైబ్రిడ్ పిచ్​ కంటే హైబ్రిడ్ పిచ్ మన్నిక కూడా ఎక్కువే. ముఖ్యంగా టీ20 మ్యాచ్​ల్లో దీని ప్రభావం కనిపించనుంది.

ఇప్పుడు ఈ పిచ్​లను ఎక్కడ వాడుతున్నారు? ఈ రకమైన హైబ్రిడ్ పిచ్​లను వాడేందుకు ఐసీసీ ఇప్పటికే అంగీకరించింది. దీంతో ఇంగ్లాండ్ ఓవల్, లార్డ్స్​ స్టేడియాల్లో డొమెస్టిక్ మ్యాచ్​ల్లో ఈ పిచ్​లను వాడుతున్నారు. ఇక త్వరలోనే అంతర్జాతీయ టీ20, వన్డే మ్యాచ్​లకు కూడా హైబ్రిడ్ పిచ్​లను వినియోగించనున్నారు. భారత్​లో ప్రస్తుతం ధర్మశాల స్టేడియంలోనే ఉంది. త్వరలోనే అహ్మదాబాద్, ముంబయి మైదానాల్లో ఏర్పాటు చేయనున్నారు.

భారత్​లో తొలి మ్యాచ్ ఎప్పుడు? ఐపీఎల్​ సీజన్ 17లోనే హైబ్రిడ్ పిచ్ వినియోగించనున్నారు. మే 9న పంజాబ్- బెంగళూరు జట్లు ఈ హైబ్రిడ్ పిచ్​లోనే ఆడనున్నాయి. భారత్​లో హైబ్రిడ్ పిచ్ వినియోగించిన తొలి మ్యాచ్​ కూడా ఇదే కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.