ETV Bharat / politics

రాష్ట్రంలో ఊపందుకున్న ప్రధాన పార్టీల ప్రచారం - ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో అభ్యర్థుల ఎదురుదాడి - lok sabha elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 10:20 PM IST

Lok Sabha Elections 2024
Parliament Elections Campaign 2024

Election Campaign in Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. ఊరూరా తిరుగుతున్న అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలును వివరిస్తూ కాంగ్రెస్‌, తెలంగాణకు బలం, గళం బీఆర్‌ఎస్సే అంటూ గులాబీ పార్టీ, తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ అంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రధాన పార్టీల ప్రచార రువ్వడి- ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో ఎదురుదాడి

Parliament Elections Campaign 2024 : సార్వత్రిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారబరిలో జోరు పెంచాయి. ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేశామంటూ కాంగ్రెస్‌ అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో వరంగల్ పార్లమెంటరీ పరకాల యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని కావ్య ఆరోపించారు.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్​ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని - నన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి : బండి సంజయ్ - lok sabha elections 2024

Lok Sabha Elections 2024 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రైతుల్ని కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటింటి ప్రచారం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి బొగ్గు గనుల్లో తిరిగిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్‌ అమలు చేసిన సంక్షేమ పథకాల్ని గుర్తు చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ సర్కార్‌ పాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మహబూబాబాద్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వెస్ట్‌ మారేడ్‌పల్లిలో సనత్‌నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం చేశారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులతో పాటు ప్రజల్ని వెంకట్రామిరెడ్డి అనేక కష్టాలకు గురిచేశారని ఆయన విమర్శించారు.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు రోడ్‌షో నిర్వహించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం సజనాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి డీ.కే.అరుణ ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు.

కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌ రావు నామినేషన్ - హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ - lok sabha elections 2024

రైతుబంధు ఇవ్వడానికే డబ్బులు లేవు - ఇప్పుడు రుణమాఫీ చేస్తామంటే ఎవరూ నమ్మరు : పొన్నాల - ponnala Lakshmaiah fires congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.