ETV Bharat / politics

పవన్ కల్యాణ్​ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ - పిఠాపురం నుంచే సమరశంఖం - Pawan Kalyan Election Campaign

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 2:39 PM IST

Janasena Chief Pawan Kalyan Election Campaign
Janasena Chief Pawan Kalyan Election Campaign

Pawan Kalyan Election Campaign 2024 : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈనెల 30 నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఆయన పోటీచేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని, దత్తపీఠాన్ని పవన్‌ దర్శిస్తారు. మూడు రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. ఉగాది వేడుకలను కూడా పవన్‌ పిఠాపురంలోనే జరుపుకోనున్నారు.

Pawan Kalyan Election Campaign 2024 : సార్వత్రిక ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీలోని పిఠాపురం నుంచే సమర శంఖం పూరించనున్నారు. మార్చి 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ కల్యాణ్​ నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమయ్యారు.

మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఉండాలని నాయకులకు స్పష్టం చేశారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక (Puruhutika Shaktipeeth) అమ్మవారిని పవన్ దర్శనం చేసుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు.

18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన జనసేన

క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలు : క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్‌ కల్యాణ్​ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతో భేటీలకు కానున్నారు. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ కల్యాణ్‌ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్‌ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే పవన్ నిర్వహించుకోబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Chandrababu Election Campaign : మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచే చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు చంద్రబాబు వరుస పర్యటనలు చేయనున్నారు. 27న పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్​లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28వ తేదీన రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో ప్రచారం చేయనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులలో చంద్రబాబు పర్యటనలు ఉండనున్నాయి.

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ - ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చ

ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు - లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా : పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.