ETV Bharat / politics

కాంగ్రెస్ పార్టీ ఉద్దర మాటలు తప్ప, ఉద్ధరించే పనులు చేయలేదు : హరీశ్​ రావు - LOK SABHA ELECTIONS 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 7:13 PM IST

GAJWEL BRS MEETING HARISHRAO
Harish Rao comments on Congress in BRS meeting

Harish Rao comments on Congress in BRS meeting : కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో హస్తం పార్టీ ఉద్దర మాటలు తప్ప, ఉద్ధరించే పనులు చేయలేదని మాజీ మంత్రి హరీశ్​రావు ఎద్దేవా చేశారు. ఇవాళ సిద్దిపేట జిల్లాలోని మెదక్​ ఎన్నికల గజ్వేల్​ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్​, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Harish Rao comments on Congress in BRS meeting : 'అసెంబ్లీ ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చు రేవంత్ రెడ్డి, పేగులు మెడలో వేయాల్సిన అవసరం లేదు' అంటూ బీఆర్​ఎస్​ మాజీ మంత్రి హరీశ్​ రావు సీఎంపై విమర్శలు గుప్పించారు. వందరోజుల్లో కాంగ్రెస్​ పార్టీ ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించే పనులు చేయలేదని మండిపడ్డారు.

ఇవాళ సిద్దిపేట జిల్లాలోని మెదక్​ పార్లమెంట్​ ఎన్నికల గజ్వేల్​ నియోజకవర్గ బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీవీలో, సామాజిక మాధ్యమాల్లో, న్యూస్​ పేపర్లలో లీకులు తప్ప, కాంగ్రెస్​ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతాంగానికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Harish Rao on BJP and ED : ఎవరికీ ఏ కష్టం వచ్చిన తాము అండగా ఉంటామని, ముమ్మాటికీ మళ్లీ వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమేనని హరీశ్​ రావు ధీమా వ్యక్తం చేశారు. కొంత మంది అవకాశ వాదులను, బీఆర్​ఎస్​ను వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో ఆహ్వానించేది లేదని తేల్చి చెప్పారు. బీజేపీతో కలిస్తే జోడీ లేదంటే ఈడీ అని విమర్శించారు. ఆ పార్టీలోకి వెళ్లగానే వాషింగ్​ పౌడర్​లాగా అన్ని క్లీయర్​ అని, లేదంటే ఈడీ రైడ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీతోనే అధిక ధరలు, పేదరికం, నిరుద్యోగిత పెరిగిందనన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్​ ఓడించాలని బీఆర్​ఎస్​ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవుని ముందు అందరూ సమానులేనన్న ఆయన, బీజేపీ మాత్రం దేవుడి పేరుతో ఎన్నికల్లో వాడుకుంటోందని విమర్శించారు.

'రాష్ట్రానికి బీజేపీ ఏం ఇచ్చింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని ఇవ్వలేదు. నల్ల చట్టాలను తెచ్చి రైతులను పొట్టనపెట్టుకున్న పార్టీ బీజేపీ. అనేక రకాలుగా దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది.'- హరీశ్​ రావు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి

BRS Medak MP Candidate Venkatrami Reddy on Election : దేశంలోనే మంచి ఐఏఎస్​ అధికారిగా గుర్తింపు ఇచ్చిన మెదక్​ నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందని మెదక్​ బీఆర్​ఎస్​ అభ్యర్థి వెంకట రామిరెడ్డి తెలిపారు. తనకున్న పరిచయాలతో మెదక్ అభివృద్ధినీ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 100 కోట్ల రూపాయల తన సొంత నిధులతో అయిదు సంవత్సరాల్లో విద్యకు, నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తామన్నారు.

'దిల్లీలో సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్లు పరిచయం ఉన్నారు. ఉన్నతాధికారుల పరిచయాలతో సులభంగా మెదక్​ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు నిధులు తెచ్చి అందరీ కన్నా ముందజలో ఉంటా.'- వెంకటరామిరెడ్డి, బీఆర్​ఎస్​ మెదక్​ అభ్యర్థి

కాంగ్రెస్ పార్టీ ఉద్దర మాటలు తప్ప, ఉద్దరిచ్చే పనులు చేయలేదు - మాజీ మంత్రి హరీశ్​ రావు

స్టేజీ పైనే హనుమాన్​ చాలీసా పఠించిన మాజీమంత్రి హరీశ్​రావు - Harish Rao Sang Hanuman Chalisa

పాడి రైతులకు పెండింగ్​లో ఉన్న రూ. 80 కోట్ల బిల్లులు చెల్లించాలి - సీఎం రేవంత్​కు హరీశ్​రావు లేఖ - BRS MLA Harish Rao Letter To CM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.