ETV Bharat / politics

డబుల్​ ఆర్​ ట్యాక్స్​ వసూళ్లపై ఎందుకు ఈడీ, ఐటీ విచారణకు పీఎం మోదీ ఆదేశించడం లేదు : కేసీఆర్​ - BRS Chief KCR Election Campaign

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 10:06 PM IST

Updated : Apr 30, 2024, 10:20 PM IST

BRS Chief KCR Election Campaign : డబుల్​ ఆర్ ట్యాక్స్​ వసూళ్లపై ఎందుకు ఈడీ, ఐటీ విచారణకు పీఎం మోదీ ఆదేశించడం లేదని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ప్రశ్నించారు. కొత్తగూడెంలో జరిగిన రోడ్​ షోలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. మహబూబాబాద్​, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

BRS Chief KCR Election Campaign
BRS Chief KCR Election Campaign

BRS Chief KCR Election Campaign at Kothagudam : రాష్ట్ర ప్రభుత్వం డబుల్​ ఆర్​ ట్యాక్స్​ పేరుతో వసూలు చేస్తోందని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, మరి ఎందుకు ఈడీ, ఐటీలతో విచారణ జరిపించడం లేదని బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వెంటనే ఈ విషయంపై ఈ రెండు సంస్థలను మోదీ రంగంలోకి దించాలని డిమాండ్​ చేశారు. ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్​ షోలో మాజీ సీఎం కేసీఆర్​ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్నర్​ మీటింగ్​లో కేటీఆర్​ మాట్లాడారు. మహబూబాబాద్ లోక్​సభ​ నుంచి మాలోతు కవితను, ఖమ్మం లోక్​సభ నుంచి నామ నాగేశ్వరరావును గెలిపించాలని కేసీఆర్​ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

బీఆర్​ఎస్​ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశామని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో మత విద్వేషాలు లేకుండా పరిపాలన చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్​, బీజేపీ రెండూ ఒకటేనని స్పష్టం చేశారు. వీరిద్దరిలో ఎవరికి ఓటేసిన గోదావరిలో వేసినట్లు తప్పా రాష్ట్రానికి ఏం లాభం లేదంటూ కేసీఆర్​ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలోనే ఎక్కువగా పోడు పట్టాలను అందించామని తెలిపారు. అలాగే రైతుబంధు, రైతుబీమాలను కల్పించాలమన్నారు. ఎన్నికల్లో గెలిచారు కదా రైతుబంధు ఎవరికైనా వచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

"డబుల్​ ఆర్​ ట్యాక్స్​ పేరుతో వసూలు చేస్తోందని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, మరి ఎందుకు ఈడీ, ఐటీలతో విచారణ జరిపించడం లేదు. బీఆర్​ఎస్​ పాలనలో మత విద్వేషాలు లేకుండా పరిపాలన చేశాము. వీరిద్దరిలో ఎవరికి ఓటేసిన గోదావరిలో వేసినట్లు తప్పా రాష్ట్రానికి ఏం లాభం లేదు." - కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతులకు కాంగ్రెస్‌ కమీషన్లు అడుగుతోంది : కేసీఆర్‌ - KCR Bus Yatra in Warangal

మతాల మధ్య చిచ్చు : నాడు తెలంగాణ ఉద్యమం సమయంలో కొత్తగూడానికి చాలాసార్లు వచ్చానని, అనేక సభలు పెట్టినాని కేసీఆర్​ గుర్తు చేశారు. ఆనాడు తనవెంట ఎవరూ లేకపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్నామని భావోద్వేగానికి లోనయ్యారు. తెచ్చిన తెలంగాణలో కులం, మతం వంటి వివక్షలు లేకుండా అన్ని వర్గాలను ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. అప్పుడు శాంతిభద్రతలు అద్భుతంగా ఉండేవని కొనియాడారు. ప్రస్తుతం హిందువు, ముస్లిం అంటూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అందుకే అందరినీ కోరుకుంటున్నాను ఈ రాష్ట్రం బాగుండాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించండని వేడుకున్నారు. ఈసారి కచ్చితంగా బీఆర్​ఎస్​ గెలిస్తేనే తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు దక్కుతాయని అన్నారు. కాంగ్రెస్​ కథ ముగిసిపోయిందని, బీజేపీ కథ కూడా కంచెకే అంటూ బీఆర్​ఎస్​ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్​ ఓటర్లను వేడుకున్నారు.

డబుల్​ ఆర్​ ట్యాక్స్​ వసూళ్లపై ఎందుకు ఈడీ, ఐటీ విచారణకు పీఎం మోదీ ఆదేశించడం లేదు : కేసీఆర్​

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది : కేసీఆర్‌ - KCR Bus Yatra in Khammam

చిన్న హోటల్ వద్ద కాన్వాయ్ ఆపిన కేసీఆర్ - రైతులతో బజ్జీ, కాఫీ రుచిచూస్తూ మాాటామంతి - lok sabha elections 2024

Last Updated :Apr 30, 2024, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.