ETV Bharat / bharat

శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం- అదనంగా 200మంది శిల్పులు - 2025 మార్చి నాటికి పూర్తి!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 7:15 AM IST

ayodhya ram mandir construction work
Ram temple construction work gained momentum

Ayodhya Ram Temple Construction Work : అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2025 మార్చి నాటికి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఇందుకోసం అదనంగా 200 శిల్పులను నియమించింది.

Ayodhya Ram Temple Construction Work : అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ నిర్ణయించింది. ఇందు కోసం అదనంగా 200 మంది శిల్పులను నియమించింది. 2025 మార్చి నాటికి రామమందిరం నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేసింది. ఆలయం వెలుపలి వైపు నిర్మించే చిన్న ఆలయాలు, లిఫ్ట్​ నిర్మాణ పనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపింది.

ayodhya Ram temple construction work
శరవేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు

అదనపు శిల్పుల నియామకం
అయోధ్య రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. ఇప్పుడు మొదటి అంతస్తు, శిఖరం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనిని మరింత వేగంగా పూర్తి చేయడం కోసం, అదనపు ఉద్యోగులను నియమించి స్తంభాలను చెక్కిస్తుంది ట్రస్ట్​. ఈ క్రమంలోనే నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి 200 మంది అదనపు శిల్పులను నియమించింది.

ayodhya Ram temple construction work
అయోధ్య రామ మందిర స్తంభాలు

11 దేవాలయాలు
ఆలయం లోపల భాగంలో 11 దేవాలయాలు నిర్మిస్తున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు. దీనికి తోడు ఆలయ ప్రాంగణంలో మరిన్ని శిల్పాలను కూడా చేయిస్తున్నారు. ఇవన్నీ కూడా 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే అదనపు ఉద్యోగులను నియమించింది.

ayodhya Ram temple construction work
అయోధ్య రామాలయ శిఖరం

దివ్యాంగుల కోసం లిఫ్ట్​
అయోధ్య రామ మందిరం నిర్మాణం అయ్యాక దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది శ్రీరాముని దర్శించుకుంటున్నారు. వీరిలో దివ్యాంగులు, పెద్దలు కూడా ఉంటున్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలోని బేస్​మెంట్​ సమీపంలో పశ్చిమ, దక్షిణ ద్వారాల వద్ద లిఫ్ట్​లను నిర్మిస్తున్నారు. దీంతో వారు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా దైవ దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది అని ట్రస్ట్ భావిస్తోంది. ప్రస్తుతానికి సుమారు 1,400 మంది శిల్పకారులు రాతి స్తంభాలను చెక్కుతున్నారు. వీరికి అదనంగా మరో 200 మందిని నియమించారు.

అయోధ్య రామయ్య కోసం భారీ కానుక
మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య బాలరాముడికి భక్తులు కానుకలు పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 2500 కిలోల భారీ గంట, 400 కిలోల తాళం, 108 అడుగుల బాహుబలి అగరుబత్తి సహా ఎన్నో రకాల కానుకలను అందించిన రామ భక్తులు తాజాగా మరో భారీ కానుకను రామయ్యకు సమర్పించారు. 1100 కిలోల బరువున్న భారీ సంగీత వాద్యం- తబలాను అయోధ్య రాముడి కోసం తీసుకువచ్చింది మధ్యప్రదేశ్​కు చెందిన శివ బరాత్​ జన్​ కళ్యాణ్​ సమితి బృందం. బుధవారం దీనిని రామసేవక్​ పురంలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చెన్నై ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ సందడి- విజిటర్స్​ ఫిదా!

ఎన్నికల కోడ్‌ కథ తెలుసా? ఎప్పుడు ప్రవేశపెట్టారు? అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.