తెలంగాణ

telangana

బాలయ్య 'చెన్నకేశవరెడ్డి' రీరిలీజ్​.. థియేటర్లు హౌస్​ఫుల్​.. ఫ్యాన్స్​ రచ్చరచ్చే

By

Published : Sep 25, 2022, 4:05 PM IST

Updated : Sep 25, 2022, 4:22 PM IST

బాలకృష్ణ-వి.వి.వినాయక్​ కాంబోలో అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించిన 'చెన్నకేశవరెడ్డి'.. సెప్టెంబరు 25 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లోనూ భారీ స్థాయిలో రీరిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీక్రాస్ రోడ్స్​లో బాలయ్య అభిమానులు సందడి చేశారు. దేవీ థియేటర్​లో చెన్నకేశవరెడ్డి సినిమాను ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయగా.. థియేటర్​ హౌస్​ఫుల్​ అయింది. వందలాది మంది అభిమానులు చేరుకొని బాణాసంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు వి.వి.వినాయక్ థియేటర్​కు చేరుకొని అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య ఫ్యాన్స్​ నినాదాలతో థియేటర్ పరిసరాలు మారుమోగాయి.
Last Updated :Sep 25, 2022, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details