ETV Bharat / state

'మీరు కేదార్​నాథ్ యాత్రకు వెళ్తున్నారా? - ఫేక్ హెలికాప్టర్ బుకింగ్స్ మాయలో పడకండి' - KEDARNATH HELICOPTER TICKET FRAUD

author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 2:50 PM IST

Helicopter Ticket Fraud In Mahbubnagar : కేదార్​నాథ్ వెళ్లేందుకు థర్డ్​ పార్టీ ద్వారా హెలికాప్టర్​ టికెట్ కొనుగోలు చేసి మోసపోయిన ఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో కంగుతిన్న బాధితులు స్థానిక అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Helicopter Ticket Fraud In Mahbubnagar
Kedarnath Helicopter Ticket Fraud In Mahabubnagar

థర్ట్ పార్టీ ద్వారా హెలికాప్టర్​ టికెట్​ బుక్​ చేసుకున్న పర్యటకులు అక్కడికి వెళ్లేసరికి నివ్వెరపోయే విషయాలు

Kedarnath Helicopter Ticket Fraud In Mahbubnagar : థర్డ్​ పార్టీలు, ట్రావెల్ ఏజెంట్ల నుంచి కేదార్​నాథ్​ వెళ్లేందుకు హెలికాప్టర్ బుక్​ చేసుకున్న యాత్రికులను నట్టేట ముంచేశారు. అందరి నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించారు. ఈ ఘటన మహబూబ్​నగర్​లో చోటుచేసుకుంది. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం : మహబూబ్​నగర్​, అలంపూర్​, హైదరాబాద్​కు చెందిన 11 మంది యాత్రికులు ఉత్తరాఖండ్ వెళ్లారు. అయితే అక్కడి నుంచి కేదార్​నాథ్​ ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం ఓ ప్రైవేటు ఏవియేషన్​ సంస్థ పేరిట హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకున్నారు. తీరా అక్కడకు వెళ్లాక అవి అధికారికంగా నమోదైన టికెట్లు కాదని, ఫేక్​ టికెట్లని చెప్పడంతో షాక్​ అయ్యారు.

"ఉత్తరాఖండ్​లో కేదార్​నాథ్​ యాత్రకు వచ్చిన భక్తులకు హెలికాప్ట్​ర్​ దగ్గర టికెట్ విషయంలో మోసపోయిన బాధితులం. ఆన్​లైన్లో హెలికాప్టర్​ టికెట్​ కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఫేక్​ వెబ్​సైట్లు అని తెలిసింది. ఏవీయేషన్​ అధికారులు మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. మాలాగా చాలామంది ఇక్కడ మోసపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హెలిప్యాడ్ టికెట్లు ఉన్నాయంటే ఎవ్వరు నమ్మకండి. ప్రభుత్వం కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి." - బాధితులు

'మీ ఎస్బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది' - ఇలాంటి మెసెజ్​ మీకూ వచ్చిందా? అయితే జాగ్రత్త - SBI redeem Point Reward Scam

ఫాటా నుంచి కేదార్​నాథ్​కు హెలికాప్టర్​లో వెళితే గుడికి వెళ్లేందుకు ఎక్కువగా నడవాల్సిన అవసరం ఉండదు. అందుకే నడవలేని వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం హెలికాప్టర్​ టికెట్ బుక్​ చేసుకుంటారు. నడకతో పాటు సమయం కూడా కలిసి వస్తుందని యాత్రికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఇదే అదునుగా భావించిన అగంతకులు ఫేక్​ వెబ్​సైట్లు సృష్టించి వాటి ద్వారా టికెట్​ విక్రయాలతో ఆన్​లైన్లో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు.

ఒక్కో టిక్కెట్​కు డిమాండ్​ను బట్టి రూ. 5వేల 500 నుంచి రూ.8వేల 500 వరకూ తీసుకుంటున్నారు. అలా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన దాదాపు 200 మంది యాత్రికులు ఇప్పటి వరకు మోసపోయారని సమాచారం. దీనిపై ఉత్తరాఖండ్​ ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని యాత్రికులు కోరినా ఆ సర్కార్​ నుంచి సరైన స్పందన లేదని యాత్రికులు వాపోతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన 11 మంది యాత్రికులు కూడా ఇలాగే మోసపోయారు.

SBI కస్టమర్లకు అలర్ట్​ - ఆ లింక్స్​పై క్లిక్ చేశారో - ఇక అంతే! - Alert To SBI Customers

SRH VS RCB ఐపీల్ మ్యాచ్​ టికెట్లు - ఆ లింక్ క్లిక్​ చేస్తే డబ్బులు మాయం - SRH vs Rcb Fake Tickets

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.