తెలంగాణ

telangana

పాపం గజరాజు.. కరెంట్​ షాక్​కు గురై అక్కడికక్కడే..

By

Published : Sep 23, 2022, 8:08 PM IST

Updated : Sep 24, 2022, 11:47 AM IST

()
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఓ అడవి ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. జిల్లాలోని గూడలూరులో వ్యవసాయ భూమిలోకి వచ్చిన గజరాజు.. అక్కడే ఉన్న తమలపాకుల చెట్టును నేల కూల్చింది. అదే సమయంలో విద్యుత్​ తీగ తెగి ఏనుగు మీద పడడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. అది గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. సమీపంలో ఓ గొయ్యి తీసి ఏనుగు మృతదేహాన్ని పూడ్చివేశారు.
Last Updated :Sep 24, 2022, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details