Etela Rajender Support Maheshwar Reddy Darna : రైతుల భూములను లాక్కోడానికే మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజల తరుఫున పోరాడే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని.. కాని ముఖ్యమంత్రి కేసీఅర్ పోలీసులతో బెదిరించి నిరసన ఆపివేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి బీజేపీ పూర్తి అండగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి పేరిట సీఎం అన్ని రకాల దోపిడీకి తెరలేపారని పేర్కొన్నారు. వ్యవసాయం చేసుకునే భూములను ఇండస్ట్రియల్ జోన్గా మార్చే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. నిర్మల్లో నూతన మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్ నాయకుల లబ్ధి కోసమేనని విమర్శించారు. తక్షణమే రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.