Bull Fight in Rangampet ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో పశువుల పండుగ కన్నుల పండువగా సాగింది. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున యువత హాజరయ్యారు. కోడె గిత్తలకు కట్టిన చెక్క పలకలను సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. పశువుల పండుగలో వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా ఎడ్ల జతలు రాగా 30కి పైగా జల్లికట్టులో కోడెగిత్తలను పంపారు. కోడె గిత్తలను పట్టుకునే ప్రయత్నంలో పలువురు యువకులకు గాయాలయ్యాయి. పండుగపై పోలీసులు ఆంక్షలు విధించినా గ్రామస్థులు వాటిని పట్టించుకోలేదు.