తెలంగాణ

telangana

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్రయత్నాలు - లోక్​సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు : బండి సంజయ్

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 4:49 PM IST

Bandi Sanjay Fires on BRS and Congress

Bandi Sanjay Fires on BRS and Congress : కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడవచ్చంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్​ జిల్లా మానుకొండూరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ పార్టీ నాయకులు మాజీ సీఎంకు టచ్​లో ఉన్నారంటూ ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చన్నారు. కేసీఆర్​కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని మండిపడ్డారు. 

రాష్ట్రంలో కుట్రలకు కేరాఫ్​గా నిలిచింది బీఆర్​ఎస్ అన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పోరాటం తర్వాత చేద్దామని, ముందు బీఆర్​ఎస్ పని పట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్​ కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. తెలంగాణలో అన్ని విధాలా అభివృద్ధి జరగాలంటే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా బీజేపీ ఎంపీలను గెలిపించారని కోరారు. కాంగ్రెస్ నాయకలు అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్టకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details