తెలంగాణ

telangana

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. కొండపైకి చేరేందుకు నానా అవస్థలు

By

Published : Oct 2, 2022, 3:40 PM IST

Yadadri Lakshminarasimhaswamy Temple
Yadadri Lakshminarasimhaswamy Temple

Devotees Crowd at Yadadri Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దసరా సెలవులకు తోడు ఆదివారం కావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. కొండపైకి చేరుకోవడానికి ఆలయ అధికారులు 16 ఉచిత బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిపడక భక్తులు నానా అవస్థలుపడుతున్నారు.

యాదాద్రికి పోట్టెత్తిన భక్తులు.. బస్సులు సరిపడక భక్తులు నానా అవస్థలు

Devotees Crowd at Yadadri Temple: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సెలవులు రావడంతో ఆదివారం ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ పరిసరాలు, పుష్కరిణి, వ్రత మండపం, కళ్యాణకట్ట ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

భక్తుల సౌకర్యార్థం కొండపైకి చేరుకోవడానికి 16 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో అవి సరిపోలేదు. దీంతో భక్తులు కొండపైకి వెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details