తెలంగాణ

telangana

రైలులో ప్రసవం.. తోటి మహిళలే ఆమెకు వైద్యులు

By

Published : Nov 29, 2019, 9:14 AM IST

ప్రయాణిస్తున్న రైలులో ఓ మహిళ ప్రసవించింది. తోటి మహిళలే ఆమెకు వైద్యులయ్యారు. సికింద్రాబాద్​ నుంచి హజరత్​ నిజాముద్దీన్​ వెళ్లే దురంతో ఎక్స్​ప్రెస్​లో నిన్న జరిగిన ఘటనలో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది.

తోటి మహిళలే ఆమెకు వైద్యులు
రైలులో ప్రసవించిన మహిళ

రైలులో ప్రసవం.. తోటి మహిళలే ఆమెకు వైద్యులు
రైలులో ప్రయాణిస్తున్న మహిళ ప్రసవించింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే దురంతో ఎక్స్ ప్రెస్​లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

సికింద్రాబాద్​లో కార్మికురాలిగా పనిచేసేసరితా పటేల్ ఛత్తీస్​గఢ్​లోని తన ఇంటికి వెళ్తుండగా జనగామ రైల్వే స్టేషన్ దాటగానే నొప్పులు ప్రారంభమయ్యాయి. పెండ్యాల స్టేషన్ దాటిన తర్వాత నొప్పులు ఎక్కువ కావడం వల్ల ఆమె రైలులోనే ప్రసవించింది.

అనంతరం 108కి సమాచారం అందించారు. రైలు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వేస్టేషన్​కి చేరుకోగానే అంబులెన్స్ సిబ్బంది తల్లికీ, బిడ్డకి ప్రాథమిక చికిత్స చేసి.. హన్మకొండలోని ప్రసూతి వైద్యశాలకు తరలించారు.

Intro:TG_WGL_11_29_RAIL_LO_MAHILA_PRASAVAM_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) రైలులో ప్రయాణిస్తున్న మహిళ అందులోనే ప్రసవించి... ఆడపిల్లకు జన్మనిచ్చిన ఘటన సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే దురంతో ఎక్స్ ప్రెస్ లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సరితా పటేల్ అనే గర్బిణీ రైలులో ఛత్తీస్ ఘడ్ వెళుతుండగా.... జనగామ రైల్వే స్టేషన్ దాటగానే నొప్పులు ప్రారంభమయ్యాయి. పెండ్యాల స్టేషన్ దాటిన తర్వాత నొప్పులు ఎక్కువ కావడంతో... తోటి మహిళలు అక్కడ ఉన్న పురుషులు పక్కకు పంపారు. ఈ క్రమంలో ఆమె రైలులోనే ప్రసవించగా... 108 కి అంబులెన్స్ సమాచారం అందించారు. రైలు వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ రైల్వేస్టేషన్ కి చేరుకోగానే.... అంబులెన్స్ సిబ్బంది తల్లికీ, బిడ్డకి ప్రాథమిక చికిత్స అందించి... హన్మకొండలోని ప్రసూతి వైద్యశాలకు తరలించారు. సికింద్రాబాద్ లో కార్మికురాలిగా పనిచేసే ఆమె ఛత్తీస్ ఘడ్ లోని తన ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISIONConclusion:9000417593

ABOUT THE AUTHOR

...view details