తెలంగాణ

telangana

రాకేష్​ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత.. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై దాడి

By

Published : Jun 18, 2022, 11:14 AM IST

Updated : Jun 18, 2022, 12:20 PM IST

బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై తెరాస శ్రేణుల దాడి
బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై తెరాస శ్రేణుల దాడి

11:12 June 18

రాకేష్​ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత.. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై దాడి

బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై తెరాస శ్రేణుల దాడి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లలో మృతిచెందిన వరంగల్‌ జిల్లా యువకుడు రాకేశ్‌ మృతదేహంతో భారీ ర్యాలీ చేపట్టారు. రాకేశ్‌ మృతదేహం ఉన్న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి నుంచి నర్సంపేట వరకు ఈ అంతిమ యాత్ర సాగింది. ర్యాలీలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.

ర్యాలీలో భాగంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరంగల్‌ పట్టణ పరిధిలోని పోచంమైదాన్ కూడలి వద్ద పలువురు ఆందోళనకారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇవీ చూడండి..

సికింద్రాబాద్ 'అగ్నిపథ్‌' అల్లర్ల సూత్రధారి అరెస్ట్!

కొనసాగుతోన్న రాకేష్​ అంతిమయాత్ర.. నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

Last Updated : Jun 18, 2022, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details