ETV Bharat / state

కొనసాగుతోన్న రాకేష్​ అంతిమయాత్ర.. నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

author img

By

Published : Jun 18, 2022, 11:30 AM IST

minister errabelli on agnipath: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటనలో మరణించిన రాకేష్ అంతిమయాత్ర కొనసాగుతోంది. వరంగల్‌ ఎంజీఎంలో రాకేష్​ మృతదేహానికి.. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్​, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు నివాళులర్పించారు. సాయంత్రం స్వగ్రామం డబీర్‌పేటలో రాకేష్​ అంత్యక్రియలు జరగనున్నాయి.

కొనసాగుతోన్న రాకేష్​ అంతిమయాత్ర.. నివాళులర్పించిన తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు
కొనసాగుతోన్న రాకేష్​ అంతిమయాత్ర.. నివాళులర్పించిన తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు

agnipath protest: దేశ యువతకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి: మంత్రి ఎర్రబెల్లి

minister errabelli on agnipath: సికింద్రాబాద్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దామెర రాకేష్ అంతిమయాత్ర వరంగల్ ఎంజీఎం నుంచి కొనసాగుతోంది. అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, తెరాస నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం వద్ద రాకేష్​ మృతదేహానికి మంత్రులు, నేతలు నివాళులర్పించారు.

రాకేష్‌ మృతికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెరాస నేతలు ఆరోపించారు. కేంద్రం అనాలోచిత విధానాలతో యువకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువతకు ప్రధాని క్షమాపణలు చెప్పాలన్న మంత్రి ఎర్రబెల్లి.. అగ్నిపథ్​ పథకాన్ని రద్దు చేసేంతవరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాకేష్​ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎర్రబెల్లి.. రాకేష్ స్వగ్రామం డబీర్‌పేట వరకూ అంతిమ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు.

అంతకుముందు ఎమ్మెల్యేలు వినయ్​ భాస్కర్​, పెద్ది సుదర్శన్​రెడ్డిలు రాకేష్​ మృతదేహానికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ మోదీ సర్కార్‌ అన్ని వర్గాలను అణగదొక్కుతోందని ధ్వజమెత్తారు. సైన్యంలోనూ ఔట్‌ సోర్సింగ్‌ విధానం తీసుకురావటం దారుణమన్నారు. తక్షణమే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలి. అగ్నిపథ్‌ విధానం తీసుకొచ్చి దేశ రక్షణతో ఆటలాడుకుంటున్నారు. సైన్యంలో కూడా ఔట్‌సోర్సింగ్‌ విధానం తీసుకురావటం దారుణం. ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెప్పినట్లే యువతకూ క్షమాపణ చెప్పాలి. సైనికులను చంపి భావోద్వేగాలతో గెలవాలని మోదీ చూస్తున్నారు. సికింద్రాబాద్​ ఘటనలో చనిపోయిన రాకేష్​ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.-మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి..

Agnipath protest: ‘రైళ్లను తగులబెట్టడానికి రండి..’ వైరల్‌ అవుతోన్న వాట్సాప్‌ సందేశాలు

దేశమంతా అట్టుడుకుతున్నా.. 'అగ్నిపథ్‌' అమలుకే కేంద్రం నిర్ణయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.