రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, పాడి పరిశ్రమలకు స్వర్ణయుగం వచ్చిందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి వరంగల్ గ్రామీణ, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయన పర్యటించారు.
మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయపర్తి మండలం మైలారంలోని ప్రభుత్వ పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రాయితీ కింద మంజూరైన పాడి పశువులను అర్హులకు అందించారు. 10 లక్షల చేప పిల్లలను మైలారం చెరువులో వదిలారు. అనంతరం పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.