సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో గడ్డితో ఏర్పాటు చేసిన తల్లి, బిడ్డల ఆకృతి విశేషంగా ఆకట్టుకుంటోంది. సుందరీకరణ పనుల్లో భాగంగా పచ్చదనంతో కూడిన తల్లి, బిడ్డ ఆకృతులు అధికారులు ఏర్పాటు చేశారు.
తల్లి-బిడ్డల మధ్య ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను తెలియజేసేలా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. తల్లికి బిడ్డకు మధ్య ఎంతటి బంధం ఉంటుందో... అలాంటి బంధమే ప్రకృతికి మనిషికి మధ్య ఉండాలన్న సూచికగా ఈ ఆకృతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తల్లి-బిడ్డల ఆప్యాయతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఈ ఆకృతుల పట్ల మంత్రి హరీశ్రావు ముగ్ధులయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆ చిత్రాలను షేర్ చేస్తూ... తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఇదీ చూడండి:మంజీరాలో చిక్కుకున్న 11 మంది గొర్రెల కాపరులు.. ఎలా బయటకొచ్చారంటే?