తెలంగాణ

telangana

Harish Rao on BJP: మేం పేదలకు పంచుతుంటే.. కేంద్రం కార్పొరేట్లకు దోచి పెడుతోంది: హరీశ్‌రావు

By

Published : Jul 19, 2022, 3:29 PM IST

Updated : Jul 19, 2022, 5:12 PM IST

Harish Rao on BJP: పేదలకు ఉచిత పథకాలు ఇవ్వకూడదా అంటూ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇటీవల ప్రధాని మోదీ ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరమన్న వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Harish Rao
హరీశ్ రావు

Harish Rao on BJP: వరద బాధితులకు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఓట్లకోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాళ్లని సంక్షేమ పథకాలతో ఆదుకోకూడదా అంటు విమర్శించారు. దేశంలో రూ.2 వేల పెన్షన్‌ని సీఎం కేసీఆర్‌ మాత్రమే అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో రూ.50 కోట్ల నిధులతో మంజూరైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మేం పేదలకు పంచుతుంటే.. కేంద్రం కార్పొరేట్లకు దోచి పెడుతోంది: హరీశ్‌రావు

వచ్చే 2 నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తాం. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేస్తాం. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇక్కడున్నంత అభివృద్ధి లేదు. గోదావరికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. ముంపు ప్రాంతాల్లో ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడాం.- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

భాజపా నేతలు హైదరాబాద్‌లో ఉండి బురద రాజకీయం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. మేము సంపద పెంచి పేదలకు పంచుతున్నామని తెలిపారు. భాజపా ప్రభుత్వం పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతోందని ఆరోపించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి నిత్యావసర సరకులు అందజేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని.. ఇంటిస్థలం ఉన్నవారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్, ఈసెట్​ తాజా షెడ్యూలు విడుదల..

'అగ్నిపథ్​పై​ పిటిషన్లన్నీ దిల్లీ హైకోర్టుకే.. అప్పటి వరకు ఆగండి!'

Last Updated : Jul 19, 2022, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details