తెలంగాణ

telangana

నిజామాబాద్ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

By

Published : Feb 25, 2023, 12:26 PM IST

Updated : Feb 25, 2023, 1:59 PM IST

MBBS student suicide in Nizamabad : నిజామాబాద్ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్​ చివరి సంవత్సరం చదువుతున్న హర్ష.. వసతి గృహంలోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య కారణాల వల్లే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తోటి విద్యార్థులు భావిస్తున్నారు.

Harsha is a medical student
వైద్య విద్యార్థి హర్ష

MBBS student suicide in Nizamabad : నిజామాబాద్​ జిల్లాలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వసతి గృహంలోని తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన విద్యార్థులు వార్డెన్​కు సమాచారం అందించారు. అనంతరం కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను, కళాశాల యాజమాన్యాన్ని ఆరా తీశారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన హర్ష.. నిజామాబాద్​ జిల్లాలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్​ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇవాళ పరీక్షకు హాజరు హర్ష హాజరు కాలేదు. ఏమైందోనని వసతి గృహానికి వెళ్లి చూసేసరికి తన గదిలో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్​కు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫోన్ చేశారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు.. హర్ష అనారోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాని భావిస్తున్నట్లు తోటి విద్యార్థులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు వైద్య విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హర్ష మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.

ఈ ఘటనపై వైద్య కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. విద్యార్థి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. హర్ష తెలివైన విద్యార్థి అన్న ప్రిన్సిపల్.. అతడికి అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేవని తెలిపారు. హర్షకు అనారోగ్య సమస్య ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. ఆ కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు విద్యార్థి హర్ష ఆత్మహత్యపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ ఘటన గురించి వివరాలను వైద్య కళాశాల ప్రిన్సిపల్​ను అడిగి తెలుసుకున్నారు. హర్ష మృతిపై అనుమానాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. హర్ష మృతిపై లోతుగా దర్యాప్తు చేయాలని నగర పోలీసులను కలెక్టర్ ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 25, 2023, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details