తెలంగాణ

telangana

పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

By

Published : Apr 2, 2021, 3:38 PM IST

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వద్ద స్నానానికి వెళ్లి.. ఆరుగురు మృత్యువాతపడటంపై సీఎం కేసీఆర్​, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

kcr
సీఎం కేసీఆర్​

పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లోని వీఐపీ పుష్కరఘాట్​ వద్ద.. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు మృత్యువాతపడ్డారు. స్నానానికి వెళ్లి.. ఆరుగురు మృత్యువాతపడటం కలచివేసిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా జరిగి ఉండాల్సి కాదన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

ఇదీ చదవండి:నిజామాబాద్ జిల్లాలో ఘోరం... గోదావరిలో మునిగి ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details