తెలంగాణ

telangana

హైలెవల్ కాలువకు గండి... వృథాగా పోతున్న సాగునీరు

By

Published : Jul 30, 2020, 2:05 PM IST

మాగనూరు మండలం కొత్తపల్లి శివారులో సంగంబండ బీమా ప్రాజెక్టు ఎడమ హైలెవల్ కెనాల్​కు గండి పడింది. కాలువకు మరమ్మతులు చేయకపోవడం వల్ల సాగునీరు వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైలెవల్ కాలువకు గండి... వృథాగా పోతున్న సాగునీరు
హైలెవల్ కాలువకు గండి... వృథాగా పోతున్న సాగునీరు

సంగంబండ బీమా ప్రాజెక్టు ఎడమ హైలెవల్​ కాలువకు గండి పడింది. నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం కొత్తపల్లి శివారులో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గట్టు తెగి... నీరు పంటపొలాలను ముంచెత్తింది.

కాలువలకు మరమ్మతులు చేయకపోవడం వల్లనే గండిపడి నీరు వృథాగా పోతోందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గండి పూడ్చి... కాలువకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవడి:సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details