తెలంగాణ

telangana

RAITHU BANDHU TO HOUSE LANDS: అక్కడ.. రోడ్లు, ఇళ్లకు రైతుబంధు.!

By

Published : Sep 20, 2021, 1:52 PM IST

raithu bandhu to house lands
రోడ్లు, ఇళ్లకు రైతుబంధు ()

నాగార్జున సాగర్(Nagarjuna Sagar Lands) ప్రధాన రహదారి వెంట 30 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించి ఉన్న ప్రాంతాలు, ప్రజాపంపిణీ బియ్యం సరఫరా గోదాములు నిర్మించిన ప్రాంతం, సిమెంటు రహదారులు నిర్మించిన కాలనీ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా.. వీటన్నింటినీ వ్యవసాయ భూములుగా చూపిస్తూ రెవెన్యూ(Revenue) సిబ్బంది నూతన పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేశారు. అంతే కాదు ఆ భూములకు రైతుబంధు(Raithu bandhu) కూడా మంజూరు చేస్తోంది. ఈ సంగతంతా ఈనాడు(Eenadu), ఈటీవీ- భారత్(Etv Bharat)​ నిఘాలో వెలుగుచూసింది.

నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం(Venkatadri palem) శివారులో ఉన్న ప్రాంతంలో 7.24 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి విషయంలో జరిగిన అక్రమాలు చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూలో కిందిస్థాయి సిబ్బంది పెట్టిన మెలికతో భూతగాదాలు మరింత పెరిగిపోతూ ఉండగా.. ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. మిర్యాలగూడలో భారత ఆహార(FCI) గోదాముల కార్యాలయాలు 1965లో ఏర్పాటు చేయడంతోనే దీనికి ఎదురుగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. సర్వే నెంబర్ 79లో ఉన్న 7.24 ఎకరాల భూమిని సజ్జల పుల్లారెడ్డి అనే వ్యక్తి పరిమి వీరభద్రరావుకు 1971లో విక్రయించారు. ఆయన వీటిని ఇళ్ల స్థలాలుగా మార్చి పలువురికి విక్రయాలు జరిపారు. ఈ ప్రాంతంలో వందలాదిగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. రెవెన్యూ రికార్డుల్లో సైతం 1983 పహానీలో వీరభద్రరావు పేరిట నమోదయ్యాయి.

మళ్లీ వారి పేరు మీదనే

మూడేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం నూతన పట్టాదారు పాసు పుస్తకాలు(Pass Books) మంజూరు చేసిన సమయంలో రెవెన్యూ(Revenue) సిబ్బంది లాలూచీపడి 7.26 ఎకరాల విస్తీర్ణం గల భూమిని సజ్జల పుల్లారెడ్డి కుమారుడు, సోదరుడికి ఒక్కొక్కరికి 1.36 ఎకరాల చొప్పున పేర్లు నమోదు చేస్తూ పాసుపుస్తకాలు అందించారు. ఈ నూతన పాసు పుస్తకాలకు రైతుబంధు నిధులు ఖరీఫ్​, రబీ కాలాల్లో యజమానుల ఖాతాలో జమ చేస్తున్నారు. నూతన పాసుపుస్తకాలు మంజూరు కాగానే సదరు వ్యక్తులు తమ భూములు ఉన్నాయంటూ స్థానికంగా ఉన్న ఖాళీ ప్లాట్ల యజమానుల వద్దకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారు.

2018లో వీరభద్రరావు వద్ద నుంచి 15గుంటల భూమి కొనుగోలు చేశాం. ఆ భూమిని గోదాముకు లీజు ఇచ్చాం. 1971లో సజ్జల పుల్లారెడ్డి.. వీరభద్రరావుకు సర్వే నెంబరు 79 భూమిని విక్రయించారు. ఆయన ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇప్పుడు వాళ్లు మళ్లీ ఈ భూమి మీద పట్టా పుస్తకాలు చూపించి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. -పప్పుల వెంకట్​ రెడ్డి, బాధితుడు

నేను 1973 నుంచి ఇక్కడ ఎఫ్​సీఐలో ఉద్యోగం చేస్తున్నాను. సజ్జల పుల్లారెడ్డి 7.24 ఎకరాల భూమిని వీరభద్రరావుకు విక్రయించారు. ఇప్పుడు మళ్లీ ఆ భూమి పుల్లారెడ్డి కుటుంబీకుల పేరు మీదకు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. రెవెన్యూ అధికారుల పనితీరు కారణంగానే ఇలా జరిగింది. -అబ్దుల్​ హజీజ్​, స్థానికుడు

భూ వివాదాలు

స్థానికంగా 15 గుంటల స్థలాన్ని 2018లో వీరభద్రరావు కుమారుడి వద్ద నుంచి పప్పుల వెంకట్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ స్థలం వివాదం సృష్టించగా శాంతిభద్రతల సమస్యలకు కారణమవుతోంది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వీరభద్రరావు కుమారుని వద్ద నుంచి తాము ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని ఇప్పుడు పంట భూమి పేరు మీద ఉన్న పాసు పుస్తకాలను చూపిస్తూ ఇవి తమకు చెందిన భూములని వివాదాలు సృష్టిస్తున్నారని ఆ ప్లాటు యజమాని వెంకట్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్లాట్ల యజమానులు, కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీడియాతో భూ యజమాని ఫిర్యాదు

ఇదీ చదవండి:Mosambi price issue in telangana : కర్షకుల కంట కన్నీళ్లు పెట్టిస్తున్న బత్తాయి

ABOUT THE AUTHOR

...view details