తెలంగాణ

telangana

అన్ని వ్యవస్థలనూ కేసీఆర్​ నాశనం చేశారు: ఉత్తమ్​కుమార్​రెడ్డి

By

Published : Mar 2, 2022, 10:31 PM IST

Uttam on KCR: బడ్జెట్​ సమావేశాలకు గవర్నర్​ను ఆహ్వానించకపోవడంపై ఉత్తమ్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థను కేసీఆర్​ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.

uttam kumar reddy on kcr
uttam kumar reddy

Uttam on KCR: రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్​.. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని కాంగ్రెస్​ సీనియర్​ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి విమర్శించారు. ఇష్టమొచ్చిన ఐఏఎస్​, ఐపీఎస్​లకు నాలుగైదు శాఖలు కేటాయించడం.. నచ్చనివాళ్లను పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్​ సమావేశాలకు గవర్నర్​ను ఆహ్వానించకపోవడంపై ఉత్తమ్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థను కేసీఆర్​ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.

అన్ని వ్యవస్థలనూ కేసీఆర్​ నాశనం చేశారు: ఉత్తమ్​కుమార్​రెడ్డి

'బడ్జెట్​ సమావేశాలకు గవర్నర్​ను ఆహ్వానించకపోవడం సరైన సాంప్రదాయం కాదు. ఇలాంటి వ్యవహార శైలి ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు. ఇష్టమొచ్చిన ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులకు నాలుగైదు శాఖలు కట్టబెట్టడం.. నిజాయతీగా పనిచేసేవాళ్లను పక్కన పెట్టడం సరైంది కాదు.' - ఉత్తమ్​కుమార్​రెడ్డి, నల్గొండ ఎంపీ

ఇదీచూడండి:'కేసీఆర్​ మూలాలు బిహార్​లో ఉన్నాయ్​.. అందుకే వారికే కీలక పోస్టింగులు'

ABOUT THE AUTHOR

...view details