ETV Bharat / city

'కేసీఆర్​ మూలాలు బిహార్​లో ఉన్నాయ్​.. అందుకే వారికే కీలక పోస్టింగులు'

author img

By

Published : Mar 2, 2022, 3:50 PM IST

Updated : Mar 2, 2022, 4:03 PM IST

Revanth reddy on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్.. బిహార్ ఐఏఎస్‌లను రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకుని పరిపాలన చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి విమర్శించారు. పరిపాలనలో వారి తప్పుడు పనులతో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్‌ పదే పదే చెబుతున్నారని.. నిన్న జరిగిన ఇద్దరు స్థిరాస్తి వ్యాపారుల హత్యలు ధరణి లోపాల వల్లే జరిగాయని ఆరోపించారు.

Revanth reddy on KCR:
Revanth reddy

Revanth reddy on KCR: రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కేడర్​ ఐఏఎస్​ అధికారులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వందలాది ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో.. స్థానిక అధికారులకు కీలక బాధ్యతలు దక్కడం లేదని ఆరోపించారు. బిహార్​కు చెందిన ఐఏఎస్​ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. సీఎస్​, డీజీపీ పోస్టులనూ వారికే కట్టబెట్టారని విమర్శించారు. సీఎస్​ సోమేశ్​కుమార్​, ఇంఛార్జీ డీజీపీ అంజనీకుమార్​, సీనియర్​ ఐఏఎస్​ అధికారులు జయేశ్​ రంజన్​, అర్వింద్​ కుమార్​, రజత్​కుమార్​, సందీప్​కుమార్​ సుల్తానియా, వికాస్​రాజ్​కు మూడు నుంచి ఆరు శాఖలను కట్టబెట్టారని ఆరోపించారు. బిహార్​ ఐఏఎస్​లను రక్షణ వలయంగా చేసుకొని పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా తెలంగాణ ప్రాంత అధికారులు పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.

సీఎస్​ సోమేశ్​ కుమార్​ తీరుతో ధరణి లోపభూయిష్టంగా మారిందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్​ను అడ్డంపెట్టుకొని.. అవుటర్​ రింగ్​రోడ్​ చుట్టూ లక్షలాది ఎకరాల భూమి గోల్​మాల్​ అయింది. బిహార్​ ఐఏఎస్​ కారణంగా తెలంగాణ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. ధరణి పోర్టల్​ వల్ల భూతగాదాలు వస్తున్నాయని.. అవి కాస్త హత్యలకు కారణమవుతున్నాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు. నిన్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన స్థిరాస్తి వ్యాపారుల హత్యలు.. ధరణి లోపాల వల్లే జరిగాయని ఆరోపించారు.

సీఎం కేసీఆర్​ను అడుగుతున్నా.. మీ పూర్వీకులు బిహార్ కావొచ్చు.. పరిపాలన మొత్తం వారిచేతిలో పెడతారా..?. రాష్ట్రంంలోని 157 మంది ఐఏఎస్​లలో కేవలం బిహార్ ఐఏఎస్​లే ప్రతిభావంతులా.? సీఎస్ సోమేశ్​ కుమార్​ సీనియారిటీ ప్రకారం.. ప్రిన్సిపల్ సెక్రటరీకే పరిమితం.. కానీ సీఎస్​గా బాధ్యతలు ఇచ్చారు. జయేశ్​ రంజన్​, అరవింద్​ కుమార్​, సందీప్​కుమార్​ సుల్తానియా, రజత్​కుమార్, వికాస్​రాజ్​​.. వీరందరూ బిహార్​కు చెందిన ఐఏఎస్​ అధికారులు.. ఒక ముఠాగా ఏర్పడి.. కేసీఆర్​ అక్రమాలకు సహకరిస్తున్నారు.

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్​కుమార్​.. సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలకు సహకరించినందుకు.. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. గ్రేటర్​ ఎన్నికల్లో 30 లక్షల ఓట్లను సోమేశ్​కుమార్ తొలగించారు. అందుకు నజరానాగా సీఎస్​ పోస్ట్​ ఇచ్చారు. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అర్వింద్​కుమార్​కు ఆరు శాఖలు ఇచ్చారు. డీజీపీగా ఉన్న మహేందర్​రెడ్డిని సెలవుపై పంపించి... బిహార్​కు చెందిన అంజనీకుమార్​కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

తాను ఇవన్నీ బయటపెడితే.. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది పోయి.. బిహార్​ మంత్రి తనను విమర్శిస్తున్నారని రేవంత్​రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణకు చెందిన ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు మాట్లాడారని కోరారు.

'కేసీఆర్​ మూలాలు బిహార్​లో ఉన్నాయ్​.. అందుకే వారికే కీలక పోస్టింగులు'

ఇదీచూడండి: పక్కాప్లాన్​.. పాయింట్ బ్లాంక్ రేంజ్​లో ఫైరింగ్.. హైదరాబాద్ రియల్టీల హత్యకేసులో విస్తుపోయే నిజాలు

Last Updated :Mar 2, 2022, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.