తెలంగాణ

telangana

musi project canal land occupation: కబ్జా కోరల్లో మూసీ కాలువ.. రాజకీయ, ఆర్థిక పలుకుబడితో ఆక్రమణలు!

By

Published : Sep 29, 2021, 1:48 PM IST

నల్గొండ జిల్లాలోని మూసీ కాలువ రోజురోజుకూ తగ్గిపోతోంది(musi project canal land occupation). కొందరు రైతులు తమ రాజకీయ, ఆర్థిక పలుకుబడితో కట్టతోపాటు, కాలువను దర్జాగా కబ్జా చేస్తున్నారు. దశబ్దాలనాటి కాలువను చెడగొట్టి తమ పంటపొలంలో కలిపేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇతర రైతులకు సాగునీటి కటకట ఏర్పడింది. ఒకప్పుడు సోలిపేట మూసీ కాలువ ఆయకట్టు కింద ఆమనగల్లు రైతులు వేరుశనగ పంట ఎక్కువగా వేసేవారు. నీటి వినియోగంతో కాలువ పదిలంగా ఉండేది. కాలక్రమేణా రైతులు పత్తి వైపు మొగ్గు చూపడంతో కాలువ నిరాదరణకు గురైంది. ఈ క్రమంలో కబ్జాకు గురవుతోంది. కబ్జాకు గురైన సోలిపేట మూసీ కాలువ పూర్తిస్థాయిలో సర్వే చేసి, డిజైన్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం ఈనాడు- ఈటీవీ భారత్ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.

musi project canal land occupation, musi canal latest news
కబ్జా కోరల్లో మూసీ కాలువ, మూసీ కాలువ ఆక్రమణ

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామ పరిధిలో మూసీ కాలువ ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగుకు నోచుకోవడం లేదు. కొందరు రైతులు తమ రాజకీయ, ఆర్థిక పలుకుబడితో కాలువ భూములను కబ్జా(musi project canal land occupation) చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులకు సాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఆక్రమణల కారణంగా వర్షాకాలంలో ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే సాగునీరు సజావుగా దిగువకు రావడం లేదు. ఆక్రమిత ప్రాంతంలో మూసీ జలాలు నిలిచిపోయి... ఆ ప్రాంతంలోని పత్తి, ఇతర మెట్ట పంటలు నాశనమవుతున్నాయి.

కబ్జా కోరల్లో కాలువ

కాలువ కబ్జాకు గురై... తాము పడుతున్న ఇబ్బందులను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. మూసీ కాలువ కొప్పోలు నుంచి దిగువన ఉన్న ఆమనగల్లు, రావులపెంట గ్రామాల పరిధిలో తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ మూడు వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు డిజైన్ చేశారు. ఆమనగల్లు చెరువు నిండి అలుగుపోసే సమయంలో వచ్చే వరదను సైతం ఈ కాలువకు అనుసంధానం చేశారు. దీంతో అధిక వర్షాలు కురిసిన సందర్భాల్లోనూ వచ్చే వరద నీరు సైతం ఈ కాలువ గుండా ప్రవహించి రావులపెంట చెరువులోకి చేరుతుంది. ఈ కాలువను కొందరు కబ్జా(musi project canal land occupation) చేసి సాగుకు అనుకూలంగా మలుచుకున్నారు. ఫలితంగా కాలువ విస్తీర్ణం తగ్గిపోయింది. కొన్నిచోట్ల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. వాస్తవంగా కాలువ విస్తీర్ణం 66 ఫీట్లు ఉండేదని స్థానికులు, అధికారులు చెబుతున్నారు.అయితే భీమవరం, సూర్యాపేట రోడ్డు కల్వర్టు నుంచి అర కిలోమీటర్ పొడవునా కాలువ ఆక్రమణకు గురైంది.

ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు

కాలువ కబ్జాతో రాకపోకలు, యంత్రాలతో పంట నూర్పిడి చేసుకోవడం అత్యంత క్లిష్టంగా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లు వద్ద కాలువ కబ్జా విస్తీర్ణం సుమారు ఆరు ఎకరాల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై ఎవరైనా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తే... భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఈ కాలువ... అర కిలోమీటరు మేర పూర్తిగా కబ్జాకు గురికావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. గతంలో పంట పొలాలకు వెళ్లేందుకు ఇరువైపులా కాలువ కట్టలు ఉండేవని... ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వెళ్లి సాగు పనులు పూర్తి చేసుకునే వాళ్లమని చెబుతున్నారు. ఇప్పుడు వాటి ఆనవాళ్లు లేకుండా చేసి... ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.

ఆమనగల్లు వద్ద సోలిపేట మూసీ కాలువ ఆక్రమించుకున్నారని మా దృష్టికి వచ్చింది. వేములపల్లి ఎస్సై రాజుతో కలిసి ఆక్రమించుకున్న ప్రదేశాన్ని పరిశీలించాం. ఒకచోట హద్దురాళ్లు ఏర్పాటు చేశాం. రెవెన్యూ అధికారులతో జాయింట్ సర్వే చేయించి కాలువ హద్దులను నిర్ధారించి... ఆక్రమణలు తొలగించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

-ఉదయ్ కుమార్, మూసీ ప్రాజెక్టు ఏఈఈ

ఇదీ చదవండి:Air Passenger Statistics: విమానాల్లో తెగ తిరిగేస్తున్నారు.. ఆ లెక్కలేంటో తెలుస్తే షాక్​ అవుతారు!

ABOUT THE AUTHOR

...view details