తెలంగాణ

telangana

Less Facilities in Karimnagar Govt hospital : కొత్త ఆసుపత్రులు సరే... ఉన్న వాటిల్లో సదుపాయాల సంగతేెంటి.?

By

Published : May 28, 2023, 8:00 AM IST

Less Facilities in Karimnagar Govt hospital : రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్​ తరహా వైద్యం అందించాలన్న ప్రభుత్వం మాటలు నామమాత్రంగానే ఉంటున్నాయి. మండుతున్న ఎండలతో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో బాలింతలు, నవజాత శిశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాతాశిశు కేంద్రంలోని వార్డుల్లో సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో.. విలవిల్లాడుతున్నారు. కేసీఆర్ కిట్ కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఒకవైపు పురిటినొప్పులు.. మరోవైపు ఉక్కపోతతో బాలింతలు అల్లాడుతున్నారు.

Etv Bharat
Etv Bharat

కొత్త ఆసుపత్రులు సరే..ఉన్న వాటిల్లో సదుపాయాల సంగతేెంటి..?

Less Facilities in Karimnagar Govt hospital : ఉష్ణోగ్రత పెరగడంతో పాటు ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే..కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో బాలింతలు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. మాతాశిశు కేంద్రంలోని వార్డుల్లో సరిపోను ఫ్యాన్లు లేకపోవడంతో ఎండ వేడికి బాలింతలతో పాటు ముక్కుపచ్చలారని చిన్నారులు విలవిలలాడుతున్నారు. కేసీఆర్ కిట్ కారణంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు విధిగా తమతో ఫ్యాన్లు తెచ్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పురిటినొప్పులు మరోవైపు ఉక్కపోతతో ఆసుపత్రిలో బాలింతలు తల్లడిల్లుతున్నారు.

సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో బాలింతల ఇక్కట్లు : కరీంనగర్‌ మాతాశిశు కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. నాలుగు జిల్లాలకు కేంద్రం కావడంతో కాన్పు కోసం వచ్చే గర్భిణీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే కరీనంగర్‌ ఆసుపత్రిలో వసతుల పరిస్థితి మాత్రం అనుకున్నంత మేర లేకపోవడంతో బాలింతలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. వార్డుల్లో అక్కడక్కడ బిగించి ఉన్న ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తుండటంతో నవజాత శిశువులు కనీసం కంటి మీద కునుకు తీయడం లేదు. వేడి గాలులకు నూనూగు చర్మం కంది పోతోంది. కాన్పుల సంఖ్య పెంచాలన్న ప్రకటనలే తప్ప ప్రసవానికి వచ్చే గర్భిణులకుఆసుపత్రిలో కలిపిస్తున్న సదుపాయాలను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదన్న ఆవేదన బాలింతల్లో వ్యక్తమవుతోంది.

ఉక్కపోత నుంచి విముక్తికి సొంత ఫ్యాన్ల వినియోగం : ఆసుపత్రిలో 8 మహిళల వార్డులు ఉండగా ఒక్కో వార్డులో 20 మంది బాలింతలు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిపి సుమారు 40 నుంచి 50 మంది ఉంటున్నారు. కానీ వారికి ఏర్పాటు చేసిన ఫ్యాన్లు మాత్రం 5 మాత్రమే. రోజురోజుకు ఉక్కపోత పెరగడంతో ఏమి చేయాలో తోచని పరిస్థితి ఉందని ఆ మహిళలు వాపోతున్నారు. ఆపరేషన్లు, కాన్పు నొప్పులతో తాము మంచం మీది నుంచి కదలలేని పరిస్థితి ఉందని క్రిక్కిరిసిన వార్డులో ఆ ఫ్యాన్లతో వశపడక గత్యంతరం లేని పరిస్థితిలో ఇళ్ల నుంచి ఫ్యాన్లు తీసుకువస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Warangal Super Specialty Hospital : సెప్టెంబర్​ కల్లా వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి రెడీ

సిజేరియన్ తర్వాత భరించలేని నొప్పులతో పాటు సరైన గాలి రాక ఊపిరాడని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిజేరియన్లు, శస్త్రచికిత్సల కారణంగా వారం రోజుల వరకు కనీసం స్నానాలు చేయలేని పరిస్థితి ఉంటోందంటున్నారు. మరోవైపు వేడి కారణంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలిపారు. బాలింతల పరిస్థితి చూడలేక తాము అదనపు ఖర్చు అయినా ఫర్వాలేదని ఫ్యాన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉక్కపోతను పెద్దలే భరించలేక పోతున్నారు, ఇక ముక్కపచ్చలారని చిన్నారులు ఎలా భరిస్తారని వారంటున్నారు. ప్రస్తుతం వేడి పెరిగిపోయిన దృష్ట్యా కనీసం కూలర్లు ఏర్పాటు చేస్తే తప్ప తట్టుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వేడి రోజురోజుకు పెరుగుతున్న దృష్ఠ్యా ప్రసూతికి వచ్చే మహిళలు, చిన్నారులకు కలుగుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details