తెలంగాణ

telangana

TSPSC Paper Leakage Case Update : సెంచరీకి చేరువలో టీఎస్​పీఎస్సీ అరెస్టుల సంఖ్య.. తాజాగా మరో ముగ్గురు

By

Published : Aug 16, 2023, 6:18 PM IST

TSPSC Paper Lekage case 3 more arrested : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో బుధవారం మరో ముగ్గురిని అధికారులు అరెస్ట్​ చేశారు. దీంతో ఇప్పటి వరకూ అరెస్టయిన వారి సంఖ్య 99కి చేరింది. అరెస్టయిన వారిని విచారిస్తున్న సిట్ అధికారులకు మరికొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

TSPSC Paper Lekage Update News
TSPSC Latest Arrest Persons in Telangana

Group One Exam Leakage Case Update : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ఇవాళ మరో ముగ్గురిని అధికారులు అరెస్ట్​ చేశారు. ఈ కేసులో.. ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్​ అధికారులు అరెస్ట్​ చేసి.. ప్రవీణ్​కి వారు సహకరించారని అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకూ అరెస్ట్​ అయిన వారి సంఖ్య 99కి చేరింది. మరో పక్క.. ఈ ప్రశ్నపత్రాల​ లీకేజీ కేసులో ఏ-2గా ఉన్న రాజశేఖర్​ రెడ్డి వేసిన బెయిల్​ పిటిషన్​ నాంపల్లి కోర్టులో మరోసారి తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన బెయిల్​ పిటిషన్​ మూడుసార్లు తిరస్కరణకు గురైంది. సిట్ అధికారులు నిందితుల నుంచి సేకరించిన సెల్ ఫోన్లు, ల్యాప్​టాప్​లు, హార్డ్​డిస్క్​లను ఫోరెన్సిక్ సైన్స్​ల్యాబ్​కు పంపించారు. ఆ నివేదిక రాగానే అనుబంధ అభియోగపత్రం దాఖలు చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 37మందితో సిట్ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. మరికొందరు నిందితుల అరెస్టు​లు పెరిగే అవకాశం ఉందని సిట్​ అధికారుల తెలిపారు.

TSPSC Aspirants Arrest Number Today : దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. కనీసం 150 మంది వరకూ అరెస్టవుతారని అధికారులు అంచనావేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారని దర్యాప్తులో వెల్లడవుతోంది. ఓ అభ్యర్థి రూ.30 లక్షలు చెల్లించి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొన్నాడని అధికారులు గుర్తించారు. ఏఈ ప్రశ్నపత్రం అమ్మడం ద్వారానే ఓ వ్యాపారి రూ.2.5 కోట్లు వరకు వసూలు చేశాడని అధికారులు తెలిపారు. ఇలా అనేక మంది పెద్ద మొత్తంలో నగదు చెల్లించి టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారు. ఈ పరీక్షలు రాసిన వారిలో సుమారు రెండు శాతం మినహా మిగతావారంతా నిరుద్యోగులు. దీంతో పాటు తల్లిదండ్రులపై ఆధారపడి.. చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నారని విచారణలో అధికారులు గుర్తించారు. అందువల్ల ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చాలని కొంత మంది పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TSPSC Paper Leak Case Updates : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. ఫోరెన్సిక్‌ నివేదిక ఏది?

TSPSC Paper Leakage Case Investigation SIT Officials: ఈ కేసుకు సంబంధించిన నిందితులను జులైలో 10న 18 మందిని, 11వ తేదీన ముగ్గురిని, 12న మరో ఇద్దరిని సిట్​ అధికారులు అరెస్ట్​లు చేశారు. కరీంనగర్​లో తండ్రి, కూతుర్లలను కూడా అధికారులు అరెస్ట్​ చేశారు. మద్దెల శ్రీనివాస్‌, ఆయన కుమార్తె సాహితి ఏఈ పరీక్ష పేపర్ కోసం రమేశ్​ కుమార్‌ సహాయం కోరాడు. రూ.30 లక్షలు ఒప్పందంతో మాస్​ కాపీయింగ్​ ద్వారా పరీక్షను రాయించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో తండ్రి, కుమార్తెలను జులై 12న అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

TSPSC Paper Leak Updates : వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. మాస్‌ కాపీయింగ్‌ కోసం ఏకంగా..!

TSPSC Paper Leak Case : పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టు.. తల్లిదండ్రులకు బిగుస్తున్న ఉచ్చు.!

TSPSC Paper Leak Arrests : పేపర్‌ లీకేజ్‌ కేసులో మరో 19 మంది అరెస్టు.. 74కు చేరిన సంఖ్య

ABOUT THE AUTHOR

...view details