తెలంగాణ

telangana

Telangana Assembly Today: సభలో రెండో రోజు బడ్జెట్ పద్దులపై చర్చ

By

Published : Mar 11, 2022, 4:20 AM IST

Telangana Assembly Today: శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరగనుంది. మరో తొమ్మది పద్దులను ఇవాళ చర్చను చేపట్టనున్నారు. కీలకమైన వ్యవసాయ, రెవెన్యూ పద్దులను చర్చకు చేపడతారు.

Telangana Assembly Today: సభలో రెండో రోజు బడ్జెట్ పద్దులపై చర్చ
Telangana Assembly Today: సభలో రెండో రోజు బడ్జెట్ పద్దులపై చర్చ

Telangana Assembly Today: బడ్జెట్ పద్దులపై శాసనసభలో ఇవాళ రెండో రోజు చర్చ జరగనుంది. పద్దులపై చర్చ మొదటి రోజైన నిన్న ఎనిమిది పద్దులపై చర్చించి ఆమోదించారు. ఇవాళ మరో తొమ్మిది పద్దులపై సభలో చర్చ జరగనుంది. కీలకమైన వ్యవసాయ, రెవెన్యూ పద్దులను చర్చకు చేపడతారు.

వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రవాణా, హోం, సహకార, పశుసంవర్థక, పౌరసరఫరాల శాఖల పద్దులపై కూడా అసెంబ్లీలో ఇవాళ చర్చ జరగనుంది. అటు ప్రశ్నోత్తరాల్లో మన ఊరు - మన బడి, కేసీఆర్ కిట్, సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ ఆలోచన, పోడు భూముల పంపిణీ, పల్లెప్రగతి, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు అంశాలు చర్చకు రానున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details