తెలంగాణ

telangana

ప్రతి తెలంగాణవాసి గుండెల్లో టీడీపీ ఉంది : చంద్రబాబు

By

Published : Feb 26, 2023, 2:01 PM IST

Updated : Feb 26, 2023, 2:46 PM IST

Chandrababu comments on Telangana TDP : తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది అని ప్రశ్నించే వాళ్లకు ఖమ్మం సభ తర్వాత సమాధానం దొరికిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్‌లో ప్రారంభించారు.

CBN
CBN

Chandrababu comments on Telangana TDP :తెలంగాణలోని ప్రతి ఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకుంటారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందో కనిపిస్తోందని తెలిపారు. ఎన్టీఆర్‌ తెలంగాణ గడ్డపైనే టీడీపీను ఏర్పాటు చేశారని చెప్పారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని వెల్లడించారు. 41 ఏళ్లుగా తెలుగు వాళ్ల కోసం పని చేస్తున్న పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు.

ప్రతి తెలంగాణవాసి గుండెల్లో టీడీపీ ఉంది : చంద్రబాబు

Intintiki Telugudesham Program in Telangana : పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ టీడీపీ అన్న చంద్రబాబు.. సంక్షేమ పథకాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదవారికి ఎన్టీఆర్‌ స్వాతంత్య్రం అందించారన్నారు. రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేశారని వెల్లడించారు. మహిళలకు సాధికారత కల్పించింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు.

'సైబర్ టవర్స్ నిర్మించిన ఘనత టీడీపీదే. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. తెలుగుదేశం ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభ తర్వాత సమాధానం దొరికింది. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారికోసం టీడీపీ పనిచేస్తుంది. నాయకత్వాన్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం. సృష్టించిన సంపదను పేదవాళ్లకు అందించడమే లక్ష్యం. ప్రజల్లో ఉండాలనే సంకల్పం అందరూ తీసుకోవాలి. - చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత

నాయకుల చుట్టూ తిరగడం కాదు.. ప్రజల వద్ద ఉండాలని ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. మే 28న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రతి ఇంటి తలుపు తట్టండని నాయకులకు సూచించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ విశిష్టత చెప్పాలని మార్గనిర్దేశం చేశారు.

'కుల సంఘాలు, వృత్తి సంఘాలు టీడీపీని బలపరిచేలా చూడాలి. సామాజిక న్యాయానికి మారుపేరు టీడీపీ. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనేది టీడీపీ లక్ష్యం. ఎన్టీఆర్‌కు భారతరత్న అనేది తెలుగువాడి ఆకాంక్ష.. దేశానికి గౌరవం. - చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవీ చదవండి:

Last Updated : Feb 26, 2023, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details