అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని ఓటర్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లగా... ఓటు లేదని వాపోయారు. ముందుగా చూసుకున్నప్పుడు తన పేరు ఆ నియోజకవర్గంలో ఉందని, తీరా ఇప్పుడు లేకపోవడమేంటని ప్రశ్నించారు. ఓటు వేసేందుకు విదేశాలకు వెళ్లిన తాను ఇక్కడకు వచ్చానని ఆమె తెలిపారు. ఇది చాలా దారుణమని, ఈ విషయాన్ని ఇలా వదిలేయనని శోభన హెచ్చరించారు.
ఓటు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శోభన కామినేని