bills for Panchayaths: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. కొన్నిచోట్ల సర్పంచులు సొంతంగా ఖర్చుపెట్టి పనులు చేసినప్పటికీ, అయిదారు నెలలుగా ఆ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగుల వేతనాలు, విద్యుత్తు ఛార్జీలు మినహా సగటున ఒక్కో గ్రామంలో 3-6 నెలల వరకు బిల్లులన్నీ ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకూ మూడు నెలలుగా జీతాల్లేవు. అసలే డబ్బులు రాక ఇబ్బందుల్లో ఉంటే మరో పక్క ఈ నెల నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కింద చేపట్టాల్సిన పనులను చూసి సర్పంచులు, పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గ్రామాల్లో జనాభా, కేటగిరీ వారీగా సగటున రూ.లక్షన్నర నుంచి రూ.6 లక్షల వరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు కలిపితే రూ.లక్షల్లో నిలిచిపోయాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తోంది. ఇవి పంచాయతీ ఖాతాల్లో కనిపిస్తున్నప్పటికీ, వీటిని నేరుగా వినియోగించకుండా ఆర్థికశాఖ ఆంక్షలు అడ్డుగా నిలుస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులు జారీ చేసిన చెక్కులు సబ్, జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో పాస్ అవుతున్నా, చివర్లో ప్రభుత్వ అనుమతి పేరిట ఆర్థికశాఖలో నిలిచిపోతున్నాయి. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియడంతో మళ్లీ బిల్లుల వ్యవహారం మొదటికొచ్చింది. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, మురుగు కాలువలకు సంబంధించిన బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్నాయి. వీధి దీపాల మరమ్మతుల బిల్లులు పంచాయతీరాజ్ శాఖ మంజూరు చేయడం లేదు. ఎల్ఈడీ దీపాల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పాలన్న నిర్ణయానికి సర్పంచులు, పాలకవర్గాలు వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ప్రస్తుతం వీరి నెల జీతం రూ.8,500. వేతన సవరణ అమల్లోకి వచ్చినప్పటికీ.. కార్మికులకు 30 శాతం పెంపు జరగలేదు. చాలీచాలని జీతాలు.. అవి కూడా రెండు, మూడు నెలలకోసారి వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.- ఓ సర్పంచ్ ఆవేదన
ఇవీ ఉదాహరణలు..