తెలంగాణ

telangana

MP Santhosh Kumar: 'సీఎం కేసీఆర్​ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుంది'

By

Published : Aug 29, 2021, 6:04 PM IST

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా... తెలుగు భాష పట్ల సీఎం కేసీఆర్​కున్న ప్రేమను ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు.

mp santhosh kumar about kcr love on Telegu language
mp santhosh kumar about kcr love on Telegu language

తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ జోగినపల్లి సంతోష్​ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష పట్ల తన పెదనాన్న, సీఎం కేసీఆర్​కు ఎనలేని ప్రేమ ఉందని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు. వేల పుస్తకాలు ఆపోశన పట్టిన కేసీఆర్​ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో రాష్ట్రంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడిన సీఎం కేసీఆర్​ ప్రసంగాన్ని ఎంపీ పంచుకున్నారు.

"వేల పుస్తకాలు ఆపోశన పట్టిన ఘన వ్యక్తిత్వం, తెలుగు భాష పట్ల అనన్యసామాన్యమైన ప్రేమ, వెరసి మా పెదనాన్న, మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. వీరి సారథ్యంలో తెలుగు భాష మరింతంగా వికసిస్తుందనడంలో సందేహం లేదు." - జోగినపల్లి సంతోష్​కుమార్​, ఎంపీ

ABOUT THE AUTHOR

...view details