KTR Fires On Karnataka Minister Shivanand Patil : రైతులను ఉద్దేశించి కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తప్పు బట్టారు. రుణాలు మాఫీ అవుతాయని రైతులు కరవు రావాలని కోరుకుంటున్నారన్న శివానంద పాటిల్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రైతుల గురించి హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్న వీరు, ఎలాంటి మంత్రులని ప్రశ్నించారు. ఏ రైతు కూడా కరవు రావాలని కోరుకోడన్న ఆయన, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా వారు కోరుకునేది ప్రభుత్వం నుంచి సానుభూతి మాత్రమేనని పేర్కొన్నారు.
రైతుల గురించి హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్న వీరు ఎలాంటి మంత్రులు? ఏ రైతు కూడా కరవు రావాలని కోరుకోడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా వారు కోరుకునేది ప్రభుత్వం నుంచి సానుభూతి మాత్రమే. - కేటీఆర్ ట్వీట్
తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదు: కేటీఆర్
Minister Shivanand Patil Comments On Farmers :కర్ణాటక (Karnataka) మంత్రి శివానంద పాటిల్ (Shivanand Patil) రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన రైతు రుణ మాఫీల గురించి ప్రస్తావించారు. తమ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేందుకు రైతులు ఏటా కరవును కోరుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి.