తెలంగాణ

telangana

Kishan Reddy Fires on CM KCR : అబద్ధాలు ఆడటం.. ప్రజలను మభ్యపెట్టడంలో కల్వకుంట్ల కుటుంబం ఫస్ట్‌: కిషన్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 7:59 PM IST

Kishan Reddy Fires on CM KCR : కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ 10 ఎకరాల స్థలం ఇచ్చారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయానికి 11 ఎకరాల భూమిని కేటాయించుకున్నారని.. ఎకరం రూ.100 కోట్లు విలువచేసే స్థలాన్ని ఉచితంగా తీసుకున్నారని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు.

bjp
Kishan Reddy

Kishan Reddy Fires on CM KCR in Hyderabad : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి (Kishan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అద్దాల మేడలో కూర్చుని రాళ్లు విసిరితే.. మీ అద్దాలే పగులుతాయని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. సీఎం కుటుంబానికి అధికారం తలకెక్కిందని మండిపడ్డారు. మోదీ వచ్చి ఇక్కడ చేసేదేంటని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్​ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy Fires on KCR :కేసీఆర్‌ (KCR) ఫామ్‌హౌస్‌లో కూర్చుంటారే తప్ప.. ప్రజలకు మంచి చేద్దామని లేదని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి.. సీఎం 10 ఎకరాల స్థలం ఇచ్చారని.. బీఆర్ఎస్ కార్యాలయానికి 11 ఎకరాల స్థలం కేటాయించుకున్నారని ఆరోపించారు. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే భూమిని ఉచితంగా తీసుకున్నారని మండిపడ్డారు. పేదలకు, జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వలేదని.. కానీ పార్టీ కార్యాలయాలకు మాత్రం రూ.కోట్ల విలువైన భూములు ఇచ్చుకున్నారని కిషన్​రెడ్డి ఆక్షేపించారు.

Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు'

Kishan Reddy on Tribal University : రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి ( Tribal University) స్థలం కేటాయించకుండా తాత్సారం చేస్తూ.. గిరిజనుల పొట్ట కొడుతున్నారని కిషన్​రెడ్డి విమర్శించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి స్థలం ఇవ్వకపోయినా త్వరగా పూర్తి చేయాలని కేంద్రం ఆలోచిస్తుందన్నారు. అబద్ధాలు ఆడటం.. ప్రజలను మభ్యపెట్టడంలో కల్వకుంట్ల కుటుంబం ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుందని విమర్శించారు. కృష్ణా నదీ జలాలు, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీపై ఒకే రోజు కేబినెట్‌లో ఆమోదం పొందడం సంతోషకరమని కిషన్​రెడ్డి తెలిపారు.

"కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి సీఎం 10 ఎకరాల స్థలం ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యాలయానికి 11 ఎకరాల స్థలం కేటాయించుకున్నారు. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే భూమి ఉచితంగా తీసుకున్నారు. భూములు.. పేదలకు ఇవ్వలేదు, జర్నలిస్టులకు ఇవ్వలేదు. పార్టీ కార్యాలయాలకు మాత్రం రూ.కోట్ల విలువైన భూములు ఇచ్చుకున్నారు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy Fires on CM KCR అబద్ధాలు ఆడటం ప్రజలను మభ్యపెట్టడంలో కల్వకుంట్ల కుటుంబం ఫస్ట్‌ కిషన్​రెడ్డి

BJP State Level Council Meeting Tomorrow : మరోవైపు తెలంగాణలో చాలా ఏళ్ల తర్వాత.. రేపు బీజేపీ రాష్ట్రస్థాయి కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని కిషన్​రెడ్డి వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించే ఈ కౌన్సిల్ సమావేశానికి.. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 1,000 మంది ముఖ్య నాయకులు వస్తున్నారని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో తీర్మానాలు, చర్చలు, అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెలుతామని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy on Telangana assembly Election 2023 : 'ఆరు నెలలు తర్వాత కాదు.. డిసెంబరు మొదటి వారంలోనే అసెంబ్లీ ఎన్నికలు'

ఇదిలా ఉండగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారని కిషన్​రెడ్డి తెలిపారు. ఈ నెల 10న ఆదిలాబాద్‌, 27న కుత్బల్లాపూర్​ లేదా రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 20, 21 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీ కూడా వస్తారని కిషన్​రెడ్డి వివరించారు.

Kishan Reddy about Krishna Water Sharing : 'కేంద్ర నిర్ణయంతో కృష్ణా జలాల సమస్య పరిష్కారమవుతుందని ఆకాంక్షిస్తున్నా'

Kishan Reddy Comments on CM KCR : 'ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్ ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details