తెలంగాణ

telangana

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి, దిగువకు నీటి విడుదల

By

Published : Aug 29, 2022, 4:11 PM IST

Srisailam Dam water release శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది.

srisailam
srisailam

Srisailam Dam water release:శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3.19 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చెస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.92 లక్షల క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది.

జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటినిల్వ 215.32 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తి చేసి 62,529 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details