Coca Cola Investments in Telangana:తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కార్యకలాపాలను విస్తరించేందుకు పెట్టుబడులు పెడుతున్న కోకాకోలా సంస్థ.. తాజాగా అదనపు పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. కోకాకోలా సంస్థ(cocacola in telangana) ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి.. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన సమావేశంలో ఒప్పందాలను కుదుర్చుకున్నారు. కోకాకోలా సంస్థకు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ భారతదేశం అని.. భారత్లో తమ కార్యకలాపాలను, వ్యాపారాన్ని మరింతగా విస్తరించే వ్యూహంతో ముందుకు పోతున్నామని జేమ్స్మేక్ గ్రివి తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు కేటీఆర్కు(KTR) తెలియజేశారు.
Coca Cola to Double Investments in Telangana : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వద్ద ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణ కోసం గతంలోనే రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించగా.. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో రూ.1,000 కోట్లతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం.. ఏప్రిల్ నెల 22వ తేదీన తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నామని తెలిపారు.
Coca Cola Investments in Telangana : రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సహకారం, ప్లాంట్ల నిర్మాణంలో వేగం, వ్యాపార వృద్దిని దృష్టిలో ఉంచుకొని కోకాకోలా సంస్థ అదనంగా మరో రూ.647 కోట్లను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్లో పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్లాంట్ డిసెంబర్ 24 వరకు పూర్తి అవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.