14:22 January 20
Central Minister Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కొవిడ్ పాజిటివ్
Central Minister Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నట్లు కిషన్రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెరాస ఎమ్మెల్యేలు కూాడా కరోనా బారిన పడ్డారు. ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్కు కరోనా పాజిటివ్గా తేలింది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రెడ్డి, శంకర్ నాయక్లకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వరుసగా అందరూ కరోనా బారిన పడుతుండటంతో.. నేతల్లో ఆందోళన మొదలైంది.
ఇదీ చదవండి: