తెలంగాణ

telangana

వివేకా హత్య కేసు: ఏపీ హైకోర్టులో సీబీఐ అనుబంధ పిటిషన్

By

Published : Nov 3, 2020, 9:04 AM IST

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను ఇచ్చేలా పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో సీబీఐ అనుబంధ పిటిషన్‌ వేసింది.

cbi-affiliated-petition-in-high-court-over-vivekananda-murder-case
వివేకా హత్య కేసు: హైకోర్టులో సీబీఐ అనుబంధ పిటిషన్

వివేకా హత్య కేసు విషయమై ఏపీ హైకోర్టులో సీబీఐ వేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. అనుబంధ పిటిషన్‌ ప్రతిని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి అందజేయాలని సూచిస్తూ విచారణ వాయిదా వేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సంబంధిత రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మేజిస్ట్రేట్​ను సీబీఐ కోరింది. ఈ అభ్యర్థనను మేజిస్ట్రేట్ తిరస్కరించింది. ఈ కారణంగా హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.

ABOUT THE AUTHOR

...view details