తెలంగాణ

telangana

Bandi Sanjay on Medical Colleges : 'వైద్య కళాశాలల ఏర్పాటుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు'

By

Published : Jun 9, 2023, 2:04 PM IST

13 New Medical Colleges to Telangana : తెలంగాణలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానికి, కేంద్ర ఆరోగ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. రాష్ట్ర ప్రజలపట్ల మోదీకి ఉన్న అభిమానంతో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay on New Medical Colleges to Telangana :రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బండి సంజయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Bandi Sanjay Thanks Prime Minister on Medical Colleges :తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శమని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. ప్రజలపట్ల మోదీకి ఉన్న అభిమానంతో తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని.. రాష్ట్ర సర్కార్ చెప్పడం.. పచ్చి అబద్ధమని బండి సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay Comments on KCR :కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని.. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా లేఖ రాశారని బండి సంజయ్ గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని వివరించారు. ఈ విషయంలో సైంధవునిలా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని మాట్లాడడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.

"రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలకు అనుమతించడం మంచి పరిణామం. కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మెడికల్ కళాశాలలపై గతంలోనే కేంద్రం స్పందించినా.. కేసీఆర్ నోరు మెదపలేదు. కేసీఆర్.. తాను స్పందించకుండా.. కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటు. రాష్ట్రానికి 13 కొత్త మెడికల్ కళాశాలకు కేంద్రం అనుమతించండ.. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం." - బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో 13 కొత్త మెడికల్ కాలేజీలు.. ఏపీలో ఐదింటికి ఆమోద ముద్ర వేసింది. 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఒక్కో కళాశాలలో.. 150 సీట్లతో మొదలు కానున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని మేడ్చల్‌, వరంగల్‌, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, కుమురం భీం అసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం, హైదరాబాద్‌లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే వైద్య రంగంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ.. మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా ఆ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details