తెలంగాణ

telangana

మూడో రోజూ ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

By

Published : Feb 20, 2020, 10:21 AM IST

ఇల్లందులో నిర్వహిస్తున్న 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మూడవరోజూ.. ఉత్సహంగా కొనసాగాయి. క్రీడాకారులు నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డారు.

state-level-kabaddi-competitions-at-illandu-in-bhadradri-kothiagudem-district
మూడో రోజూ ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మూడవరోజు విజయవంతంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియతో పాటు మహబూబాబాద్​ శాసనసభ్యుడు బానోతు శంకర్ హాజరయ్యారు.

భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే హరిప్రియ ప్రకటించారు. ఇల్లందులో నిర్వహించిన క్రీడల పట్ల క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.

మూడో రోజూ ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ఇదీ చూడండి:"చురుగ్గా బడ్జెట్‌ కసరత్తు"

ABOUT THE AUTHOR

...view details