తెలంగాణ

telangana

భద్రాద్రిలో కొనసాగుతోన్న అపదుద్ధారక స్త్రోత్ర పారాయణం

By

Published : Jun 15, 2021, 12:01 PM IST

కరోనా మహమ్మారిని నిర్మూలించాలని కోరుతూ భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రారంభించిన అపదుద్ధారక స్త్రోత్ర పారాయణం కొనసాగుతోంది. మూడో రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాకార మండపానికి స్వామివారిని తీసుకువచ్చి అపదుద్ధారక స్తోత్రం పఠించారు.

భద్రాద్రిలో కొనసాగుతోన్న అపదుద్ధారక స్త్రోత్ర పారాయణం
భద్రాద్రిలో కొనసాగుతోన్న అపదుద్ధారక స్త్రోత్ర పారాయణం

కరోనా తొలగిపోయి ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని భద్రాద్రిలో అపదుద్ధారక స్త్రోత్ర పారాయణం జరుగుతోంది. 27 రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాకార మండపానికి స్వామివారిని తీసుకువచ్చి అపదుద్ధారక స్తోత్రం పఠించారు.

ఈ నెల 24న జ్యేష్ఠాభిషేకం సందర్భంగా.. కరోనాను రామచంద్రస్వామి పారదోలాలన్న సంకల్పంతో మహత్కార్యాన్ని చేపట్టినట్లు అర్చకులు తెలిపారు.

ఇదీ చూడండి: యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

ABOUT THE AUTHOR

...view details