తెలంగాణ

telangana

Coal Production Stopped in Singareni : సింగరేణి గనుల్లో నిలిచిన పనులు.. రూ.23 కోట్ల నష్టం!

By

Published : Jul 21, 2023, 1:57 PM IST

Coal Production in Open cast mines : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, ఇందారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది.

Singareni
Singareni

భారీ వర్షాలతో.. సింగరేణి ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గుఉత్పత్తి

Singareni Open castmines : ఉపరితల ఆవర్తన ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. రైతాంగానికి హర్షం కలిగిస్తున్నా.. సింగరేణి సంస్థకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. భారీ వర్షానికి మంచిర్యాల జిల్లాలోని నాలుగు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని, రామకృష్ణాపూర్ ఉపరితల గనులు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారంఖని, కల్యాణిఖని, రామకృష్ణాపూర్, ఖైరిగుడా ఉపరితల గనుల్లో నాలుగు రోజులుగా 92000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో సింగరేణికి సుమారు రూ.23 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం రెండు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం ఇల్లందులో ఉపరితల గని ముగింపు దశకు వచ్చింది. నియోజకవర్గంలోనే అత్యధిక మొత్తంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోయగూడెంలో 37 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. లక్ష 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. చిన్నపాటి చెరువును తలపించేలా గనిలోకి నీళ్లు చేరాయి. నాలుగు పెద్ద మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు. వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. నీటిని తోడివేయడానికి పెద్ద జాక్వెల్ మోటార్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణిలో 2, 3 ఓపెన్‌ కాస్ట్‌లలోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

సింగరేణిపరిశోధనసంస్థకు ఐఎస్ఓ గుర్తింపు.. సింగరేణిలోని భూగర్భ గనుల్లో స్ట్రాటా కంట్రోల్‌, వెంటిలేషన్‌, ఓపెన్‌ కాస్ట్ గనుల్లో ఓబీ వాలుతలాల స్థిరీకరణ, బ్లాస్టింగ్‌ పద్ధతులపై పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విస్తృత పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ పరిశోధనల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించటంతో ఆ విభాగం ‘ఐఎస్‌వో 9001:2015’ ధ్రువపత్రాన్ని పొందింది. ఈ విభాగం తొలిసారిగా మణుగూరు ఏరియాలోని పగిడేరు వద్ద జియో థర్మల్‌ పవర్‌ ప్లాంటులో..భూగర్భం నుంచి ఉబికి వస్తున్న వేడి నీటితో విద్యుత్తు ఉత్పత్తిను ఏర్పాటు చేస్తోంది.

బొగ్గు నుంచి మిథనాల్‌ తయారు చేసే మోడల్‌ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నారు. తమ పరిశోధనలతో సంస్థకు సుమారు రూ.3.89 కోట్లు ఆదా చేశామని.. అంతర్జాతీయ బొగ్గు గని పరిశోధనాసంస్థలకు తీసిపోని విధంగా తాము పరిశోధనలు చేస్తున్నట్లు డీజీఎం డీఎం సుభానీ వివరించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందినందుకు సిబ్బందిని సంస్థ ఛైర్మన్‌ ఎన్‌.శ్రీధర్‌ అభినందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details