టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్డా మరోసారి వార్తల్లో నిలిచాడు. తన తల్లిదండ్రులను విమానం ఎక్కించడం తన కల అని.. శనివారం అది నెరవేరిందని ట్వీట్ చేశాడు.
"నేను కన్న ఓ చిన్న కల ఈరోజు నెరవేరింది. మొదటిసారిగా నా తల్లిదండ్రులను విమానం ఎక్కించాను"
--నీరజ్ చోప్డా, జావెలిన్ త్రో క్రీడాకారుడు.
ఒలింపిక్స్ పతకం గెలిచిన నీరజ్ చోప్డాకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇన్స్టా గ్రామ్లో మరో పోస్ట్ చేశాడు నీరజ్.
ఇదీ చదవండి:పెరిగిన నీరజ్ బ్రాండ్ విలువ.. కోహ్లీకి సమంగా!