తెలంగాణ

telangana

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో భారత్​కు రెండు రజతాలు

By

Published : Sep 25, 2021, 11:54 AM IST

Archery silver medal

ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో మన ప్లేయర్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. మరోసారి స్వర్ణాన్ని కోల్పోయినప్పటికీ, రజతాలు చేజిక్కుంచుకున్నారు.

యాంక్టాన్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో భారత మహిళల, మిక్స్​డ్ టీమ్ తలో రజత పతకం అందుకుంది. శనివారం జరిగిన పోటీల్లో త్రుటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది.

ఇప్పటికే 10 సార్లు ఈ పోటీల్లో పాల్గొన్న మన జట్టు.. ఎనిమిది సార్లు ఫైనల్​కు అర్హత సాధించింది. కానీ ఈ ప్రయత్నాలు అన్నింటిలోనూ వెండి పతకంతోనే సరిపెట్టుకుంది.

భారత మహిళా ఆర్చర్లు

మిక్స్​డ్​ టీమ్​లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖ.. ఓ పాయింట్​ ఆధిక్యంతోనే ఫైనల్​​ ప్రారంభించినప్పటికీ, కొలంబియా టీమ్​ దూకుడుతో వెనకబడింది. చివరగా నాలుగు(150-154) పాయింట్ల తేడాతో నిలిచింది.

ఏడో సీడ్​లో ఉన్న భారత్ మహిళ జట్టు.. జ్యోతి, మస్కన్, ప్రియ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఐదు పాయింట్ల(224-229) తేడాతో పోటీ పూర్తి చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details